`భాగమతి` వంటి విజయవంతమైన చిత్రం తరువాత అనుష్క ప్రధాన పాత్రలో రూపొందుతున్న సినిమా `నిశ్శబ్దం`. మల్టీలింగ్వల్ మూవీగా తెరకెక్కుతున్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్… ఇతర భాషల్లో `సైలెన్స్` పేరుతో రూపొందుతోంది. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అనుష్కతో పాటు మాధవన్, అంజలి, షాలిని పాండే, అవసరాల శ్రీనివాస్, సుబ్బరాజు తదితర ప్రముఖ నటులు ముఖ్య భూమికలు పోషిస్తున్నారు. కాగా… శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాకి సంబంధించి తాజాగా 50 శాతం షూటింగ్ పార్ట్ పూర్తయ్యింది. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు హేమంత్ మధుకర్ తన ట్విట్టర్ ఖాతాలో తెలియజేశాడు. అంతేకాదు… త్వరలోనే ఈ సినిమా ఫస్ట్ లుక్ని రిలీజ్ చేయబోతున్నట్లు హేమంత్ ట్వీటాడు. మరి… `నిశ్శబ్దం`తో అనుష్క ఏ మేరకు అలరిస్తుందో తెలియాలంటే ఈ ఏడాది చివరి వరకు వేచిచూడాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[subscribe]
[youtube_video videoid=5guYcUmIDFo]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























