సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సాహో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతోంది. ఆగస్ట్ 15న విడుదల కానున్న ఈ చిత్ర టీజర్ రీసెంట్గా విడుదలై సంచలనాలు సృష్టించింది. ప్రస్తుతం పాటల చిత్రీకరణ జరుపుకుంటుంది. ఆస్ట్రియాలోని కొన్ని అందమైన లోకేషన్లలో ప్రభాస్, శ్రద్దా మద్య ఓపాటను చిత్రీకరించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం.. శ్రద్దా షూటింగ్ పార్ట్ పూర్తయినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని తాను సోషల్ మీడియా ద్వారా తెలిపింది. సినిమాలో నా షూటింగ్ పార్ట్ పూర్తయింది.. ఇది ఒక ఇన్ క్రెడిబుల్ జర్నీలా ఉంటుంది ఇది.. హైయిర్, మేకప్, కాస్ట్యూమ్ ఈ సినిమాలో నా కోర్ టీమ్.. టీమ్ లో పనిచేసిన ప్రతి ఒక్క మెంబర్ చాలా స్పెషల్.. టూ మచ్ లవ్.. కొన్ని సార్లు బ్యాడ్ జోక్స్ క్రాక్ చేసినా భరించినందుకు థ్యాంక్స్ అని చెప్పుకొచ్చింది.
ఇంకా ఈ సినిమాలో నీల్ నితిన్, జాకీ ష్రాఫ్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, అరుణ్ విజయ్, మందిరా బేడీ ఇలా పులువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యువీ క్రియేషన్స్ అధినేతలు వంశీ-ప్రమోద్ అత్యంత భారీ బడ్జెట్ తో ఏక కాలంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
[youtube_video videoid=rDoFiOjoC2Y]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: