నటసింహ నందమూరి బాలకృష్ణకి కలిసొచ్చిన కథానాయికలలో శ్రియ ఒకరు. ఈ ఇద్దరి కలయికలో ‘చెన్నకేశవరెడ్డి’, ‘గౌతమిపుత్ర శాతకర్ణి’, ‘పైసా వసూల్’, `యన్టీఆర్ కథానాయకుడు` (శ్రియ అతిథి పాత్ర) చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు ఈ ఇద్దరు మరోసారి జట్టు కట్టనున్నట్టు టాలీవుడ్ టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… `జై సింహా` తరువాత బాలకృష్ణ, దర్శకుడు కె.ఎస్.రవికుమార్ కలయికలో మరో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. హ్యాపీ మూవీస్ పతాకంపై సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో… బాలయ్య పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్గా దర్శనమివ్వనున్నాడు. కాగా… ఇద్దరు కథానాయికలకు స్థానమున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో ఒక హీరోయిన్గా శ్రియని ఎంపిక చేశారని తెలుస్తోంది. త్వరలోనే శ్రియ ఎంట్రీపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. జూలై నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ చిత్రం… 2020 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ప్రస్తుతం శ్రియ ‘నరగాసురాన్’, ‘సందక్కరి’ వంటి తమిళ చిత్రాలతో పాటు… ప్రకాష్ రాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘తడ్క’ అనే హిందీ చిత్రంలోనూ నటిస్తోంది. అలాగే చంద్రశేఖర్ యేలేటి రూపొందించనున్న ఓ ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్లోనూ శ్రియ ప్రధాన పాత్ర పోషించనుందని టాక్.
[youtube_video videoid=Km3aFMJKRYM]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: