సూపర్ స్టార్ మహేష్ బాబు, సక్సెస్ఫుల్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్లో తెరకెక్కిన ‘మహర్షి’… ఈ ఏడాది వేసవి సందర్భంగా మే 9న విడుదలై బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. అంతేకాదు… తాజాగా వంద కోట్ల షేర్ క్లబ్లో కూడా చేరిపోయింది. ఈ నేపథ్యంలో… మహేష్, వంశీ కాంబినేషన్లో మరో సినిమా రాబోతున్నట్లు టాలీవుడ్ టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… ప్రస్తుతం మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ హిలేరియస్ ఎంటర్టైనర్… జూలై 1 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ క్రేజీ ప్రాజెక్ట్ రిలీజ్ కానుంది. కాగా… ఈ సినిమా పూర్తయ్యేలోపే వంశీ కాంబినేషన్ మూవీని సెట్స్ పైకి తీసుకువెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నాడట మహేష్. అంతేకాదు… ఈ సినిమాను కూడా `మహర్షి` తరహాలోనే వేసవి సందర్భంగా 2020 సమ్మర్ సీజన్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. అంతేకాదు… మహేష్ వరుస చిత్రాలు ‘మహర్షి’, ‘సరిలేరు నీకెవ్వరు’ను ఇతర నిర్మాతలతో కలసి సంయుక్తంగా నిర్మించిన, నిర్మిస్తున్న ‘దిల్’ రాజు… మహేష్, వంశీ కొత్త ప్రాజెక్ట్ను సోలోగా ప్రొడ్యూస్ చేయనున్నాడని సమాచారం.
త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడయ్యే అవకాశముంది.
[subscribe]
[youtube_video videoid=dHgXi2Vn1GU]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: