సురేష్ ప్రొడక్షన్స్… దేశం గర్వించదగ్గ చిత్ర నిర్మాణ సంస్థలలో ఒకటి. పరాజయాలలోనూ అవకాశాలుంటాయని నమ్మిన సంస్థ. అందుకే 55 ఏళ్ళుగా తమ సంస్థలో పలు చిత్రాలను నిర్మించి ఘన విజయాలను సొంతం చేసుకుంటోంది. మూవీ మొఘల్, స్టార్ ప్రొడ్యూసర్ డి.రామానాయుడు స్థాపించిన ఈ సంస్థను ఆయన తనయుడు డి.సురేష్ బాబు ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ సంస్థలో పలు క్రేజీ ప్రాజెక్ట్స్ను నిర్మించనున్నట్టు అధినేత సురేష్ బాబు స్వయంగా వెల్లడించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా తెరకెక్కే మూడు చిత్రాలను ప్రొడ్యూస్ చేసే పనిలో ఉంది సురేష్ ప్రొడక్షన్స్. వాటిలో ఒకటి టాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ మూవీ కాగా… మరొకటి త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం. ఇవే కాకుండా… ఇటీవల విడుదలై విజయం సాధించిన హిందీ సినిమా ‘దే దే ప్యార్ దే’ రైట్స్ను కూడా సొంతం చేసుకుంది సురేష్ ప్రొడక్షన్స్. వెంకీ ప్రధాన పాత్రలో తెరకెక్కే ఈ కామెడీ ఎంటర్టైనర్ను కూడా నిర్మించనుందీ సంస్థ. మరోవైపు యువ కథానాయకుడు రానా ప్రధాన పాత్రలో కూడా రెండు చిత్రాలను నిర్మిస్తోంది. వాటిలో ఒకటి ఇన్నోవేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ కాంబినేషన్లో రూపొందనున్న ‘హిరణ్యకశిప’ కాగా… మరొకటి రానా, వేణు ఊడుగుల కలయికలో రానున్న ‘విరాట పర్వం’. ఈ ఐదు చిత్రాలకు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. అంతేకాదు, వీటిలో కొన్ని చిత్రాలను సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ భాగస్వామ్యంలో నిర్మించనున్నట్లు సమాచారం.
కాగా… వెంకీ, నాగ చైతన్య హీరోలుగా తెరకెక్కుతున్న ‘వెంకీమామ’ చిత్రాన్ని కూడా సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలసి నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే సమంత ప్రధాన పాత్రలో రూపొందిన ఓ బేబీ
కూడా ఈ సంస్థ భాగస్వామ్యంలో వస్తోంది. అలాగే ఈ చిత్ర హిందీ రీమేక్తో పాటు మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్లను సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించనుంది.ఈ చిత్రాలన్నీ కూడా ఘనవిజయం సాధించాలని ఆకాంక్షిద్దాం.
[subscribe]
[youtube_video videoid=a8jLt8-NJCI]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: