‘ఒరేయ్ ఆంజనేలూ..! తెగ ఆయాస పడిపోకు చాలు.. మనం ఈదుతున్నాం ఒక చెంచాడు భవసాగరాలు’ అంటూ సాగే టైటిల్ సాంగ్ ను వినని 90s కిడ్స్ వుండరు. ఇది అమృతం సీరియల్ సాంగ్. ఈ సీరియల్ 90s కిడ్స్తో సహా ఎంతోమందికి అత్యంత ఇష్టమైనది.అమృతం అప్పట్లో బుల్లితెర మీద సంచలనం సృష్టించింది. ఇక ఈ సీరియల్ను ఇప్పుడు యూట్యూబ్ లో వస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రీమాస్టర్డ్ ఆడియో మరియు వీడియో క్వాలిటీతో ప్రేక్షకులకు అందిస్తున్నారు.అమృతం సీరియల్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యూట్యూబ్ ఛానెల్ వేదికగా ఇది అందుబాటులోకి వస్తుంది. నవంబర్ 24వ తేదీ నుంచి ఈ ఎపిసోడ్లను విడుదల చేయడం ప్రారంభించారు.ప్రతి రోజూ రెండు ఎపిసోడ్ ల చొప్పున ఉదయం 11 గంటలకు అలాగే సాయంత్రం 5 గంటలకు యూట్యూబ్లో విడుదలవుతాయి.ఇప్పటికే విడుదలైన ఎపిసోడ్స్ కి ప్రేక్షకులను నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది.
ఈ సీరియల్లో టైటిల్ పాత్రలో అమృతరావుగా మొదట్లో శివాజీ రాజా నటించగా ఆ తర్వాత నరేశ్, అనంతరం హర్షవర్ధన్ నటించి ప్రేక్షకులను నవ్వించారు.అలాగే గుండు హనుమంతురావు,రాగిణి,శివన్నారాయణ ,వాసు ఇంటూరి , జాన్సీ వంటి నటులు సహాయ పాత్రలతో ఆకట్టుకున్నారు.ఇక ఇప్పుడు అమృతం మళ్ళీ వస్తుండడంతో ఆ నాటి రోజులను గుర్తు చేసుకుంటూ ప్రేక్షకులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























