బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లేటెస్ట్ థ్రిల్లింగ్ బ్లాక్ బస్టర్ ‘కిష్కింధపురి’. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గారపాటి నిర్మించారు. అద్భుతమైన ప్రిమియర్స్తో మొదలైన ఈ చిత్రం సెప్టెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని హౌస్ఫుల్గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రెస్మీట్ నిర్వహించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా నిర్మాత సాహు గారపాటి మాట్లాడుతూ.. ” ఈ సినిమాని సపోర్ట్ చేసిన అందరికీ థాంక్యూ. మీడియా వారు ఈ సినిమాని ప్రేక్షకులకు దగ్గరగా తీసుకువెళ్లారు, వారికి ధన్యవాదాలు. డిస్ట్రిబ్యూటర్స్ నుంచి, ఆడియన్స్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. మేము అనుకున్న దానికంటే డబుల్ ఇంపాక్ట్ రెస్పాన్స్ వస్తుంది.” అని తెలిపారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “ఇండస్ట్రీ నుంచి కూడా చాలా మంది ఫోన్ చేసి విష్ చేశారు. మా బ్యానర్లో చాలా మంచి సినిమా పడింది. మా హీరో సాయి గారికి, డైరెక్టర్ కౌశిక్కి, హీరోయిన్ అనుపమకి, పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. వారి సహకారంతోనే ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చాను.ఇది వెరీ ప్రౌడ్ మూమెంట్. థాంక్యూ ఆల్” అని అన్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























