`మహానటి`తో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది కేరళ కుట్టి కీర్తి సురేష్. అభినేత్రి సావిత్రి పాత్రలో కీర్తి ఒదిగిపోయిన తీరుకి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. సుదీర్ఘ విరామం తరువాత… మరో తెలుగు చిత్రానికి సంతకం చేసింది కీర్తి. నూతన దర్శకుడు నరేంద్ర నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకి సంబంధించి ఇటీవలే పూజా కార్యక్రమాలు జరిగాయి. కాగా… రెగ్యులర్ షూటింగ్ని ఈ నెల 10 నుంచి ప్రారంభించనున్నట్లు సమాచారం. హైదరాబాద్లో చిత్రీకరణను మొదలుపెట్టి… అనంతరం కేరళలో షూటింగ్ జరపడానికి యూనిట్ ప్లాన్ చేస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా… పిరియాడిక్ డ్రామాగా ఉంటుందని ఆ మధ్య కొన్ని కథనాలు వినిపించాయి. అయితే… ఆ వార్తల్లో నిజం లేదని తెలిసింది. ఫ్యామిలీ డ్రామాగా ఈ సినిమా ఉంటుందని సమాచారం. మహేష్ కోనేరు నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ కి `మహానటి` ఫేమ్ డానీ ఛాయాగ్రహణం అందిస్తున్నాడు. ఈ సంవత్సరం ద్వితీయార్ధంలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: