విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి శ్రీమతి సువర్ణలత (86) ఈరోజు ఉదయం బెంగళూరులోని తన స్వగృహంలో కన్నుమూశారు. గత కొంతకాలంగా వయోభారంతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె, పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రకాష్ రాజ్ తన తల్లితో ఎంతో సన్నిహితంగా ఉండేవారు. షూటింగ్స్ ఎంత బిజీగా ఉన్నా తరచూ ఆమెను కలుస్తూ ఉండేవారు. ఆమె మరణవార్త తెలియగానే ప్రకాష్ రాజ్ వెంటనే బెంగళూరుకు చేరుకున్నారు. కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం, సువర్ణలత అంత్యక్రియలు నేడు (సోమవారం) సాయంత్రం బెంగళూరులో నిర్వహించనున్నారు.
సువర్ణలత గారి జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం. ఆమె కర్ణాటకలోని హుబ్లీలో ఒక అనాథ శరణాలయంలో పెరిగారు. ఎన్నో కష్టాలను ఎదుర్కొని నర్సింగ్ విద్యను పూర్తి చేసి, బ్రతుకుదెరువు కోసం బెంగళూరుకు చేరుకున్నారు. అక్కడ ఒక ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న సమయంలోనే ప్రకాష్ రాజ్ తండ్రిని వివాహం చేసుకున్నారు. ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం నుండి ప్రకాష్ రాజ్ నేడు పాన్ ఇండియా స్టార్గా ఎదిగారంటే, దాని వెనుక ఆమె చేసిన త్యాగాలు మరియు పెంచిన విధానం ఎంతో ఉందని ఆయన గతంలో పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు.
ప్రకాష్ రాజ్ మాతృమూర్తి మరణం పట్ల చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. “ప్రముఖ నటుడు శ్రీ ప్రకాష్ రాజ్ గారి మాతృమూర్తి శ్రీమతి సువర్ణలత గారు కన్నుమూశారని తెలిసి చింతించాను. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, ప్రకాష్ రాజ్ గారికి మరియు వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను” అని పేర్కొన్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























