బెల్లంకొండ సాయిశ్రీనివాస్, మలయాళీ ముద్దుగుమ్మ, ‘కన్మణి’ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన హారర్ థ్రిల్లర్ ‘కిష్కింధపురి’. యంగ్ డైరెక్టర్ కౌశిక్ పెగాళ్ళపాటి దర్శకత్వం వహించిన ఈ మూవీ సెప్టెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నుండి కీలక అప్డేట్ అందింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
డబ్బింగ్ పూర్తిచేసిన హీరోయిన్..
అనుపమ పరమేశ్వరన్ తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పనులను పూర్తి చేసినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం ఆమె డబ్బింగ్ స్టూడియోకు వచ్చారు. ఆమె పాత్ర సినిమాకు చాలా కీలకంగా ఉంటుందని, తన పాత్రకు ఆమె ఎంతో అంకితభావంతో డబ్బింగ్ చెప్పారని దర్శకుడు కౌశిక్ పెగళ్ళపాటి తెలిపారు.
ఈ సినిమా కథ ఒక హారర్ థ్రిల్లర్ అని, ఇందులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మరియు అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారని తెలిపారు. ఈ సినిమాను ‘షైన్ స్క్రీన్స్’ బ్యానర్పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్తోనే సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.
అనుపమ పరమేశ్వరన్ డబ్బింగ్ పూర్తి కావడంతో, సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు మరింత వేగవంతం అయ్యాయి. ‘కిష్కింధపురి’ ప్రేక్షకులను థ్రిల్ చేస్తుందని, ఈ సినిమా ఒక గొప్ప హారర్ చిత్రంగా నిలుస్తుందని చిత్ర బృందం నమ్మకంగా చెబుతోంది. ఈ సినిమా విడుదల కోసం అనుపమ అభిమానులు మరియు తెలుగు సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























