ఇటీవల తాను చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదమైన నేపథ్యంలో హీరో విజయ్ దేవరకొండ స్పందించారు. ‘రెట్రో’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కాశ్మీర్ లోని ఉగ్రదాడి గురించి ఆయన మాట్లాడుతూ, ‘ఆదివాసీ’ అనే పదం వాడారు. అయితే ఈ వ్యాఖ్యలు ఆదివాసీ లను అవమానించేలా ఉన్నాయని, విజయ్ దేవరకొండపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరుతూ ట్రైబల్స్ లాయర్స్ అసోసియేషన్ బాపూనగర్ అధ్యక్షుడు కిషన్రాజ్ చౌహాన్ హైదరాబాద్ లోని ఎస్ఆర్నగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మరోవైపు ఈ వ్యాఖ్యలను పలు ఆదివాసి సంఘాలు కూడా తప్పుబట్టాయి. హీరో క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో తాజాగా విజయ్ దేవరకొండ ఈ వివాదంపై స్పందించారు. ఎవరినీ బాధ పెట్టడం తన ఉద్దేశం కాదని, అలాగే ఎవరినీ కించపరిచే ఉద్దేశం కూడా లేదని, అయినా తన వ్యాఖ్యల వలన ఎవరైనా బాధపడివుంటే క్షమాపణలు తెలుపుతున్నానని చెప్పారు. ఈ మేరకు ఆయన నేడు సోషల్ మీడియా వేదికగా ఒక బహిరంగ ప్రకటన విడుదల చేశారు.
“నేను ఉపయోగించిన ‘ట్రైబ్’ అనే పదం చారిత్రక మరియు ఆంగ్ల డిక్షనరీ అర్థం ప్రకారం వాడాను. శతాబ్దాల క్రితం ప్రపంచవ్యాప్తంగా మానవ సమాజం తెగలు, కుటుంబాలుగా ఏర్పడి, తరచుగా సంఘర్షణలు పడే కాలాన్ని సూచించే ఉద్దేశంతో ఆ పదాన్ని ఉపయోగించాను. అది వలస వచ్చిన. లేదా స్వాతంత్య్రానంతర భారతదేశంలో 100 సంవత్సరాల క్రితమే అధికారికంగా ఏర్పడిన షెడ్యూల్డ్ తెగల వర్గీకరణను ఉద్దేవించి చేసిన వ్యాఖ్యలు కాదు” అని విజయ్ స్పష్టం చేశారు.
ఇంకా ఆయన ఇలా అన్నారు.. “ట్రైబ్ అంటే: “సామాజిక, ఆర్థిక, మతపరమైన లేదా రక్త సంబంధాలతో ముడిపడి, ఉమ్మడి సంస్కృతి మరియు మాండలికం కలిగిన కుటుంబాలు లేదా సమాజాల సమూహం, ఇది ఒక సాంప్రదాయ సమాజంలో ఒక సామాజిక విభాగం. శాంతి, పురోగతి మరియు ఐక్యత గురించి మాట్లాడటమే తన ఏకైక లక్ష్యం. నేను ఎప్పటికీ ప్రజలను ఐక్యం చేయడానికే ఆలోచిస్తానని, విభజించడానికి కాదు” అని విజయ్ దేవరకొండ ఆ లేఖలో పేర్కొన్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: