సోషల్ మీడియా వచ్చిన తరువాత టెక్నాలజీ పరంగా ఎంత అడ్వాన్స్ అయినా కూడా దానివల్ల ఏది నిజమైన వార్త.. ఏది ఫేక్ న్యూస్ అనేది చెప్పడం చాలా కష్టమైపోయింది. ఇక తాజాగా జరిగిన ఘటన అందరినీ షాక్ కు గురిచేస్తుంది. నటి పూనమ్ పాండే చనిపోయిందని నిన్న సోషల్ మీడియాలో వార్తలు తెగ ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే కదా. కొంతకాలంగా సర్వైకల్ క్యాన్సర్ తో బాధపడుతున్న ఆమె శుక్రవారం తెల్లవారుజామున ప్రాణాలు కోల్పోయినట్లు ఆమె మేనేజర్ మీడియాకు వెల్లడించారు. దీంతో చాలా యంగ్ ఏజ్ లో చనిపోయిందని.. ఈ వార్త ఎంతోమందిని షాకింగ్ కు గురిచేయడమే కాదు చాలామంది ఆమె మరణానికి విచారం కూడా వ్యక్తం చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఇప్పుడు షాకింగ్ అప్ డేట్ వచ్చింది. నేను బ్రతికే ఉన్నానంటూ తన సోషల్ మీడియా ద్వారా ఒక వీడియో పోస్ట్ చేస్తూ తెలిపారు. గర్భాశయ క్యాన్సర్ కారణంగా ఎంతో మంది మహిళలు ప్రాణాలు కోల్పోతున్నారని… అందరికీ ఈ మహమ్మారిపై అవగాహన కల్పించాలనే ఆలోచనతోనే తాను చనిపోయినట్టు సోషల్ మీడియాలో ప్రచారం చేశామని చెప్పారు. తన మరణ వార్తతో బాధపడిన, ఇబ్బంది పడిన అందరికీ క్షమాపణలు చెపుతున్నానని అన్నారు. అయితే పూనమ్ చేసిన పనికి విభిన్నంగా స్పందిస్తున్నారు. కొంతమంది అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట హాట్ టాపిక్గా మారింది.
View this post on Instagram
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: