టాలీవుడ్లోని నేచురల్ యాక్టర్స్లో సుహాస్ ఒకడని పేర్కొన్నారు అగ్ర నిర్మాత అల్లు అరవింద్. ఈ మేరకు ఆయన సుహాస్ తాజాగా నటించిన ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ సినిమా హిట్ టాక్ తెచ్చుకున్న నేపథ్యంలో.. గీతా ఆర్ట్స్ కార్యాలయంలో యూనిట్ నిర్వహించిన సక్సెస్ మీట్లో పాల్గొన్న సందర్భంగా ప్రసంగించారు. కాగా ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్పై సంయుక్తంగా నిర్మించారు. దుశ్యంత్ కటికినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శివాని నాగరం హీరోయిన్గా నటించగా.. శరణ్య ప్రదీప్, నితిన్ కీ రోల్స్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” టీమ్ నా దగ్గరకు వచ్చి మనం సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకోవాలి అన్నప్పుడు చాలా సంతోషమేసింది. ఈ సినిమా రషెస్ చూసినప్పుడు, నిన్న ఫస్ట్ కాపీ చూశాక ఇది చాలా మంచి సినిమా, సక్సెస్ కావాలి అనిపించింది. యాక్షన్, ఇతర అనవసర ఎలిమెంట్స్ లేకుండా స్వచ్ఛంగా ఒక కథ చెప్పారు. నిర్మాతగా ధీరజ్ ఈ మూవీని బాగా తీసుకురావాలని ఎంతో ప్రయత్నించాడు. దర్శకుడు దుశ్యంత్ ప్రతి సీన్ను చక్కగా తెరకెక్కించాడు. గీతా సంస్థలో భాగమైన ప్రొడక్షన్స్ అన్నీ సక్సెస్ కావాలి. అందుకు మీడియా సహకారం కావాలని కోరుకుంటున్నా” అని పేర్కొన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “ఇటీవల కాలంలో అక్కా, తమ్ముడి మధ్య ఎమోషన్స్తో సినిమా రాలేదు. శరణ్య అక్క క్యారెక్టర్లో అద్భుతంగా నటించింది. ఇంటర్వెల్ టైమ్కు సుహాస్ యాక్టింగ్ చూస్తుంటే, ఈ కుర్రాడు ఏం నటిస్తున్నాడురా అనిపించింది. అంత సహజంగా నటించాడు. మనకున్న అతి కొద్ది మంది న్యాచురల్ యాక్టర్స్లో సుహాస్ ఉంటాడు. చాలా పైకి వస్తాడు. ఇక చేయబోయే సినిమాలు కూడా గుడ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. శివాని కూడా తన క్యారెక్టర్స్కు తగినట్లు చేసింది. విలన్గా నితిన్ ఆకట్టుకున్నాడు” అని తెలిపారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: