విక్టరీ వెంకటేష్ టైటిల్ రోల్లో నటించిన తాజా చిత్రం ‘సైంధవ్’. ఇది వెంకటేష్ కెరీర్లో మైల్ స్టోన్ ప్రాజెక్ట్ 75వ చిత్రంగా తెరకెక్కుతోంది. యూనిక్ యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు వెరీ ట్యాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. ‘సైంధవ్’ చిత్రంలో ‘జెర్సీ’ ఫేమ్ శ్రద్ద శ్రీనాథ్ హీరోయిన్గా నటిస్తుండగా.. ప్రముఖ బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ విలన్ పాత్రను పోషిస్తున్నారు. అన్ని ఫార్మాలిటీస్ని పూర్తి చేసుకొని సంక్రాంతికి జనవరి 13 న గ్రాండ్ రిలీజ్కు సిద్ధంగా ఉంది. విడుదల తేదీ సమీపిస్తున్నందున చిత్రబృందం ప్రమోషన్స్లో మరింత దూకుడు పెంచిది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి టీజర్, పాటలు రిలీజ్ చేయగా.. ప్రేక్షకులను అలరించాయి. ఈ క్రమంలో నేడు, మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్ను విడుదల చేశారు. ఇక ట్రైలర్ను చూస్తుంటే ‘సైంధవ్’ ఇంటెన్స్, ఎమోషనల్ యాక్షన్ కథాంశంగా రూపొందినట్లు అర్ధమవుతోంది. ఈ సందర్భంగా విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ.. మీ అందరి సమక్షంలో ట్రైలర్ లాంచ్ చేయడం చాలా అనందంగా వుంది. ట్రైలర్ అద్భుతంగా వచ్చింది. సినిమా కూడా తప్పకుండా మీ అందరికీ బాగా నచ్చుతుంది. సంక్రాంతి రోజు సినిమా రిలీజ్ చేస్తున్నాం. ఎప్పటిలానే మీ అందరి ప్రేమ అభిమానాలు ప్రోత్సాహం కావాలి. 75వ చిత్రంగా ‘సైంధవ్’ లాంటి సినిమా చేయడం అదృష్టంగా బావిస్తున్నాను” అని పేర్కొన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “దర్శకుడు, డీవోపీ, మ్యూజిక్ డైరెక్టర్ మా టీం అంత అద్భుతంగా వర్క్ చేశారు. మా నిర్మాతలు సినిమాకి కావాల్సిన ప్రతిది సమకూర్చారు. న్యూ ఏజ్ యాక్షన్ థ్రిల్లర్ చేయాలని ఎప్పటి నుంచో వుండేది. ‘సైంధవ్’ మంచి ఎమోషన్తో కూడిన న్యూ ఏజ్ యాక్షన్తో ఫాస్ట్ పేస్డ్ ఫిలిం. తప్పకుండా మీ అందరికి నచ్చుతుంది. సినిమా మొదలైన 15వ నిమిషం నుంచే ప్రేక్షకులు సినిమాలో ఇన్వాల్ అవుతారు. సైంధవ్ ప్రేక్షకులకు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ‘సైంధవ్’ నా కెరీర్లో ఒక బెస్ట్ ఫిల్మ్. సంక్రాంతికి రియల్ ట్రీట్, తప్పకుండా అందరినీ అలరిస్తుంది’’ అని వెంకటేష్ చెప్పారు.
ఇక ‘సైంధవ్’ చిత్రంలో బేబీ సారా, కోలీవుడ్ స్టార్ హీరో ఆర్య, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇక ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా.. ఎస్ మణికందన్ కెమెరామెన్గా, గ్యారీ బిహెచ్ ఎడిటర్గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్గా పని చేస్తున్నారు. నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై వెంకట్ బోయనపల్లి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు కిషోర్ తాళ్లూరు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాగా సైంధవ్ చిత్రం జనవరి 13న పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్గా విడుదల కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: