టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ యాక్టర్ సుహాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’. దుశ్యంత్ కటికినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మ్యారేజ్ బ్యాండ్ లీడర్ మల్లి క్యారెక్టర్లో సుహాస్ కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ఇప్పటికే విడుదల చేసిన మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. అలాగే ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన గుమ్మా సాంగ్ కూడా నెట్టింట వైరల్ అవుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా ఈ సినిమా రిలీజ్ అప్డేట్పై క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ సినిమాను ఫిబ్రవరి 2న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం మేకర్స్ సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 2న ఈ సినిమాను గ్రాండ్గా థియేటర్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. కాగా వైవిధ్యమైన కథా కథనాలతో తెరకెక్కిన ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ మూవీ థియేటర్స్లో ఆడియెన్స్కు యూనిక్ ఎక్సీపిరియన్స్ ఇస్తుందని చిత్రబృందం ఆశిస్తోంది.
కామెడీ డ్రామా కథతో తెరకెక్కుతున్న’అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ సినిమాలో శివానీ నగరం హీరోయిన్గా నటిస్తుండగా.. శరణ్య, ‘పుష్ప’ ఫేమ్ జగదీశ్ ప్రతాప్, ప్రదీప్, జబర్దస్త్ ప్రతాప్ భండారి, గోపరాజు రమణ తదితరులు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక కేరాఫ్ కంచరపాలెం ఫేమ్ మహా వెంకటేష్ అలానే గీతాఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్ని వాసు ఇంకా ధీరజ్ మొగిలినేని కలిసి సంయుక్తంగా నిరిస్తున్నారు. ఈసినిమాకు శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: