పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ క్రేజీయెస్ట్ ప్రాజెక్ట్ ‘సలార్’. రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ సినిమా తొలిభాగం ‘సలార్: పార్ట్ 1-సీజ్ ఫైర్’ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ ఫ్యాన్స్కు ఒక శుభవార్త అందింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సలార్ సినిమా టికెట్ రేట్ల పెంపుకు అనుమతి లభించింది. ఈ మేరకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. దీని ప్రకారం.. నిబంధనల మేరకు మొదటివారం టికెట్ ధరలు పెంచుకునేందుకు నిర్మాతలకు వెసులుబాటు కలిగింది. దీనిపై సలార్ యూనిట్ హర్షం వ్యక్తం చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ‘సలార్’ చిత్రాన్ని తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వారి విజ్ఞప్తి మేరకు సినిమా విడుదలైన తర్వాత తొలివారం వరకూ.. అంటే డిసెంబర్ 28 వరకు టికెట్ ధరలు పెంచుకునేలా తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిప్రకారం.. మల్టీప్లెక్స్ల్లో రూ.100, సింగిల్ థియేటర్లలో రూ.65 పెంచుకోవచ్చు. అలాగే డిసెంబర్ 22న రాష్ట్రవ్యాప్తంగా అన్ని థియేటర్లలో ఉదయం 4 గంటల షోకు అనుమతినిస్తూ 6 షోలు వేసుకునే సదుపాయం కల్పించింది. దీనితోపాటు నైజాంలో హైదరాబాద్ సహా ఖమ్మం, నల్గొండ, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో మొత్తం 20 థియేటర్లలో అర్థరాత్రి 1 గంటకు బెనిఫిట్ షోలకు ప్రత్యేక అనుమతి ఇచ్చింది.
మరోవైపు ఏపీ ప్రభుత్వం కూడా ‘సలార్’ సినిమాకు మొదటివారం టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో టికెట్పై రూ.40 పెంచుకునేలా వెసులుబాటు కల్పించింది. అయితే తెలంగాణలో కంటే అదనంగా మరో మూడు రోజులపాటు.. అంటే, సినిమా విడుదలైన పది రోజుల వరకు పెరిగిన ధరలు అమలులో ఉంటాయని స్పష్టం చేసింది. అయితే టికెట్ల పెంపుకు ఆమోదం తెలిపిన ఏపీ ప్రభుత్వం సలార్ చిత్రానికి అదనపు షోలకు మాత్రం అనుమతి ఇవ్వలేదు. ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికే టికెట్ల విక్రయాలు ప్రారంభం కావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ థియేటర్ల వద్దకు క్యూ కడుతున్నారు.
కాగా ఈ హై వోల్టేజ్ యాక్షన్ మూవీలో శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తుండగా.. ప్రముఖ మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రను పోషిస్తున్నారు. అలాగే టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతిబాబు, శ్రేయ రెడ్డి, ఈశ్వరీ రావు ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకి ‘కేజీఎఫ్’ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం సమకూర్చగా, భువన్ గౌడ సినిమాటోగ్రఫీ అందించారు. హోంబలే ఫిలిమ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని గ్రాండ్గా నిర్మించారు. అత్యంత భారీ బడ్జెట్తో రూపొందిన ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: