ఓటీటీలోకి వచ్చేసిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Miss Shetty Mr Polishetty Streaming on OTT

‘జాతిరత్నాలు’ ఫేమ్ నవీన్ పొలిశెట్టి, ప్రముఖ హీరోయిన్ అనుష్క శెట్టి జంటగా రూపొందిన చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించగా.. పి మహేష్ బాబు దర్శకత్వం వహించారు. సీనియర్ నటి జయసుధ, అభినవ్ గోమటం, మురళీ శర్మ, తులసి, సోనియా దీప్తిలు తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి రాధాన్, గోపీ సుందర్ మ్యూజిక్ అందించారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం తొలిరోజునుంచే పాజిటివ్‌ టాక్‌తో మంచి వసూళ్లు రాబట్టింది. విడుదలైన అన్ని సెంటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవడంతో పాటు నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఫన్ ఫామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. నేటినుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో అందుబాటులో ఉంది. సో.. థియేటర్లో చూడనివారు.. ఈ సినిమాను ఇప్పుడు ఎంచక్కా ఇంట్లోనే చూసేయొచ్చు. నేటి యువత భావాలకు దగ్గరగా ఉండటం, అలాగే పెళ్లి, పిల్లలు తదితర విషయాలపై ప్రస్తుత జెనరేషన్ ఆలోచనలకు రిలేటెడ్ గా ఉన్న కథాంశం కావడంతో ఈ సినిమా చాలామందిని ఆకట్టుకుంది. అలాగే సినిమాలో హీరో నవీన్‌ పొలిశెట్టి, హీరోయిన్ అనుష్క శెట్టి మధ్య కెమిస్ట్రీ కూడా చాలా బావుందని ప్రసంశలు లభించాయి. ఇక సున్నితమైన అంశాన్ని ఎక్కడా తడబాటు లేకుండా దర్శకుడు ప్రెజెంట్ చేసిన విధానం సింప్లీ సూపర్బ్ అని ప్రేక్షకులతోపాటు సినీ ప్రముఖులు కూడా కితాబిచ్చారు.

కాగా ఈ సినిమా ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లో సైతం కాసులు కురిపించింది. ప్రధానంగా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ యూఎస్‌లో డాలర్ల వర్షం కురిపించింది. ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా దాదాపు రూ.3 కోట్ల వరకూ షేర్ ను అందుకోగా.. యూఎస్‌లో 193K డాలర్లను రాబట్టుకొని అక్కడ బెస్ట్ ఓపెనింగ్స్ అందుకుంది. తాజా అప్‌డేట్ ప్రకారం ఈ మూవీ యూఎస్‌లో ($1.825M+) రూ.15,19,26,687 రాబట్టి.. టాక్ ఆఫ్‌ ది ఇండస్ట్రీ గా నిలిచింది. తద్వారా ఈ సినిమా యూఎస్‌లో ఈ యేడాది అత్యధిక వసూళ్లు సాధించిన 4వ తెలుగు చిత్రంగా నిలిచింది. ఓవరాల్‌గా రూ. 30 కోట్ల షేర్ సహా రూ. 50 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.

‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’.. కథేంటంటే..?

ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ప్రేమ, పెళ్లిపై సదుద్దేశం లేని అన్విత (అనుష్క) పరిస్థితుల ప్రభావంగా ఒక బిడ్డకి తల్లి కావాలని కోరుకుంటుంది. ఈ క్రమంలో సిద్దూ(నవీన్ పోలిశెట్టి)ని చూస్తుంది. తన బిడ్డకు తండ్రిగా సిద్దూ అయితే పర్ఫెక్ట్ గా ఉంటుందని భావించి అతనితో సన్నిహితంగా ఉంటుంది. అలాగే తన ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ గురించి కూడా తెలుసుకుంటుంది. అయితే మరోవైపు ఇవన్నీ చూసిన సిద్దూ.. అన్విత తనను ప్రేమిస్తుందనుకుని ఆమెకు ప్రపోజ్ చేస్తాడు. కానీ అన్విత పెళ్లి వద్దని, అయితే అతని సహకారంతో తల్లి కావాలనుకుంటున్నానని అసలు విషయం సిద్దూకి చెబుతుంది. దీంతో సిద్దూ ఏం నిర్ణయించుకుంటాడు? అన్విత ప్రపోజల్ కు ఒప్పుకుంటాడా? లేక ప్రేమ అంటే నమ్మకంలేని.. అన్వితనే సిద్దూ ప్రేమలో పడుతుందా? అనేది మిగిలిన కథ. ప్రస్తుత జెనరేషన్ వారికి బాగా కనెక్ట్ అయ్యే కథ కావడంతో సినిమా మంచి వసూళ్లు రాబడుతోంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.