బిగ్ బాస్ 7 హౌస్ లో దొంగలు- కెప్టెన్సీ పోరు

bigg boss season 7 telugu contestants captaincy war

బిగ్ బాస్ సీజన్ 7 అయిదో వారంలో పవరాస్త్ర కోసం పోటీ జరుగుతున్న సంగతి తెలిసిందే కదా. అయితే సందీప్, శోభా శెట్టి, ప్రశాంత్ దగ్గర ఉన్న పవరాస్త్రలు కూడా బిగ్ బాస్ తిరిగి ఇచ్చేయమనడంతో వీరు ముగ్గురు కూడా పోటీలో పాల్గొనాల్సి వచ్చింది. ఇక ఈ వారం పవరాస్త్ర పోటీలో భాగంగా మొదటి టాస్క్ గా స్మైల్ ప్లీజ్ అనే టాస్క్ ఇచ్చాడు. అయితే ఈ టాస్క్ లో హౌస్ మేట్స్ జంటలుగా విడిపోయి పోటీ పడ్డారు. కానీ టాస్క్ మాత్రం ఎవరూ పర్ఫెక్ట్ గా ఆడకపోవడంతో సంచాలకులుగా ఉన్న శోభా శెట్టి ఇంకా ప్రిన్స్ చాలా సేపు చర్చలు జరిపి ఫైనల్ గా మొదటిస్థానం గౌతమ్-శోభ శ్రీకి సెకండ్ ప్లేస్ అమర్-సందీప్ కు థర్డ్ ప్లేస్ శివాజీ-ప్రశాంత్ కు నాలుగో ప్లేస్ శోభా-ప్రియాంకకు అయిదో ప్లేస్ ప్రిన్స్-తేజకు ఫిక్స్ చేస్తూ తెలిపారు. అయితే వీరి నిర్ణయం పై హౌస్ మేట్స్ ఆసహనం వ్యక్తం చేస్తారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక మొదటి టాస్క్ అయి పోయిన తరువాత నేడు రెండో టాస్క్ తో వచ్చేశాడు బిగ్ బాస్. దొరికితే దొంగ దొరక్కపోతే దొర అనే టాస్క్ ను ఇచ్చాడు. ఈ టాస్క్ ఏంటంటే యాక్టివిటీ రూంలో బిగ్ బాస్ ఫ్రెండ్ నిద్రపోతుంటాడు. అయితే ఆ రూమ్ లోకి టీమ్ నుండి ఒక సభ్యుడు లోపలికి వెళ్లి బిగ్ బాస్ ఇచ్చిన క్లూలను బట్టి వస్తువులను తీసుకురావాల్సి ఉంటుంది. ఇక ఈ టాస్క్ లో బిగ్ బాస్ చెప్పినవి కాకుండా ఇతర వస్తువులను కూడా తీసుకొస్తారు. మరోవైపు శుభశ్రీ, ప్రిన్స్ కు కొన్ని వస్తువులు అర్థం కాక వారికి ఏది దొరికతే అది తెచ్చారు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఇచ్చాడు. బిగ్ బాస్ చెప్పినవి కాకుండా వేరే వస్తువులు ఎవరైతే తక్కువ తెస్తారో వారే ఈ పోటీలో ఉంటారని చెప్పడంతో హౌస్ మేట్స్ షాకవుతారు. దీంతో ఈ టాస్క్ లో ప్రశాంత్-శివాజీ విజయం సాధిస్తారు.

ఈ టాస్క్ తరువాత మూడో టాస్క్ ను ఇస్తాడు బిగ్ బాస్. మూడో టాస్క్ గాఫ్రూట్ నింజా అనే టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్ ఏంటంటే.. జోడీలో ఒక మెంబర్ తలపై బుట్ట పెట్టుకొని నిలబడితే మరో టీమ్ మెంబర్ బుట్టలో ఆరెంజెస్ వేయాల్సి ఉంటుంది. ఇచ్చిన టైమ్ లో కలెక్ట్ చేసిన ఆరంజెస్ నుండి జ్యూస్ తీయాల్సి ఉంటుంది. ఇక ఈ టాస్క్ లో ప్రిన్స్-తేజ గెలుస్తారు. అలా ఓవరాల్ గా ఇచ్చిన మూడు టాస్కుల్లో శివాజీ-ప్రశాంత్ 5 స్టార్లు, సందీప్-అమర్.. గౌతమ్-శుభ శ్రీ జంటలు 4 స్టార్లు.. ప్రియాంక, శోభా.. ప్రిన్స్-తేజ జంటలు 2 స్టార్లు గెలుచుకున్నారు. ఫైనల్ గా శివాజీ-ప్రశాంత్ లకు ఎక్కువ స్టార్లు రావడంతో వారు ఆ వారం కెప్టెన్సీ పోటీలో నిలవనున్నారు. మరి వీరిద్దరికే కెప్టెన్సీ టాస్క్ ఉంటుందా.. లేకపోతే ఏదైనా ట్విస్ట్ ఇచ్చి మరో కంటెస్టెంట్ ను పోటీలోకి తీసుకొస్తాడా అన్నది రేపటి ఎపిసోడ్ లో చూడాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − five =