యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి భారీ ఆఫర్ పట్టేశాడు.జాతిరత్నాలు తరువాత యూవీ క్రియేషన్స్ లో నటించి హ్యాట్రిక్ కొట్టిన ఈహీరో ఇప్పుడు మరో బడా నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ మేకర్స్ లో సినిమా చేసే ఛాన్స్ కొట్టేశాడు.అందుకు సంబంధించి హింట్ కూడా ఇచ్చేశారు మైత్రి నిర్మాతలు.నవీన్ నటించిన లేటెస్ట్ మూవీ మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి తో విజయం సాధించినందుకు మైత్రి నిర్మాతలు నవీన్ యెర్నేని,రవి శంకర్.. నవీన్ పోలిశెట్టి ని కలిసి అభినందించారు.ఈ సందర్భంగా త్వరలోనే కొత్త సినిమాను స్టార్ట్ చేయనున్నాం.. ఎనర్జిటిక్ ఎంటర్టైనర్ చూడడానికి మీరు రెడీ ఆ అంటూ మైత్రి మూవీస్ మేకర్స్ ట్వీట్ చేసింది దాంతో నవీన్ పోలిశెట్టితో మైత్రి సినిమా చేయనుందని ఫిక్స్ అయ్యింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Congratulations @NaveenPolishety for the Hat-trick blockbusters
Looking forward to work on something exciting soon!
Are you guys up for an energetic entertainer? pic.twitter.com/AzNcTsYOVb
— Mythri Movie Makers (@MythriOfficial) September 21, 2023
మరి ఈసినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారో చూడాలి.ఇక మైత్రి లో సినిమా అంటే బడ్జెట్ గురించి ఆలోచించాల్సిన పనిలేదు సో సరైన కథ దాన్ని కరెక్ట్ గా డీల్ చేసే దర్శకుడు దొరికితే చాలు నవీన్ కు మరో హిట్ పడ్డట్లే అంతే కాదు నవీన్ స్టార్ లీగ్ లో చేరడానికి ఇదే గొప్ప అవకాశం.మరి ఈఅవకాశాన్ని ఎంత వరకు సద్వినియోగం చేసుకుంటాడో.
ఇదిలావుంటే మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ తో రన్ ను కొనసాగిస్తోంది. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేయడంతో డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలను తెచ్చిపెడుతుంది.మహేష్ బాబు పి డైరెక్ట్ చేసిన ఈసినిమాలో అనుష్క హీరోయిన్ గా నటించగా రధన్ సంగీతం అందించాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: