ఈసారి ఉల్టా పల్టా అంటూ మొదలైన సీజన్ 7 లో తొమ్మిది రోజులు గడిచిపోయి పదో రోజులోకి అడుగుపెట్టింది. కంటెస్టెంట్ లో పర్మినెంట్ ఇంటి సభ్యులు అవ్వడానికి చాలా కష్టపడుతున్నారు. అందులో భాగంగానే బిగ్ బాస్ టాస్క్ లు ఇస్తూ వస్తున్నాడు. గత వారం సందీప్ పవరాస్త్రను గెలుచుకొని ఇంటిసభ్యుడు అయ్యాడు. ప్రస్తుతం రెండో వారంలో పవరాస్త్రకోసం పోటీ నిర్వహిస్తున్నాడు బిగ్ బాస్
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మలుపులో ఉంది గెలుపు
ఇక మాయస్త్ర లో భాగంగా పుల్ రాజా పుల్ అనే గేమ్ ను పెట్టగా అందులో రణధీర టీమ్ గెలుస్తుంది. అందులో భాగంగా ఒక కీ వస్తుంది. మరోవైపు మాయస్త్ర లో భాగంగా రెండో టాస్క్ ను ఇచ్చాడు బిగ్ బాస్. ‘మలుపులో ఉంది గెలుపు’ అనే టాస్క్ ఇచ్చాడు. ఈ పోటీలో మూగ్గురు జోడీలు పాల్గొన్నారు. ప్రియాంక- గౌతమ్ కలిసి ఆడగా వారిద్దరిలో ప్రియాంక గెలుస్తుంది.. ప్రిన్స్-రతిక ఆడగా ప్రిన్స్ గెలుస్తాడు.. శోభాశెట్టి-ప్రశాంత్ ఆడగా ప్రశాంత్ గెలుస్తాడు. ఇందులో భాగంగా స్పిన్ వీల్ తిప్పగా అందులో ఎలా వస్తే.. కలర్స్ బోర్డుపై కంటెస్టెంట్లు అలా చేయాల్సి వచ్చింది. ఇక ఈ టాస్క్ లో కూడా రణధీర టీమే గెలుస్తుంది.
దొంగతనం స్కెచ్
ఒకవైపు రణధీర టీమ్ టాస్క్ లు గెలుస్తుంటే మరోవైపు మహాబలి టీమ్ కీ కొట్టేయాలన్న ప్లాన్ వేస్తుంది. బాక్స్ ను ఓపెన్ చేయాలంటే ఫైనల్ గా కీ నే కావాలని.. కీ ఎవరి దగ్గర ఉంటే వాళ్లు ఓపెన్ చేయొచ్చనే ఒపీనియ్ కు వచ్చి కీ కొట్టేయాలని చూస్తారు. గౌతమ్ అయితే ఏకంగా పవరాస్త్రనే కొట్టేసే ప్లాన్ వేస్తాడు. ఫైనల్ గా శుభశ్రీ పవరాస్త్ర ను దొంగిలిస్తుంది. ఈనేపథ్యంలో బిగ్ బాస్ కూడా కంటెస్టెంట్ లతో కలిసి గేమ్ ఆడుతున్నట్టు అనిపిస్తుంది. శుభశ్రీ దొంగలించిన తర్వాత బిగ్ బాస్ సప్త సముద్రాలు ఈదిన వీరుడైనా ఆదమరిస్తే.. పిల్ల కాలువలో మునగాల్సిందే. ఆ వీరుడు ఎవరు? ముంచింది ఎవరు? మునిగింది ఏంటి? చెప్పుకోండి చూద్దాం అంటూ సామెతను చెప్పాడు. బిగ్ బాస్ చెప్పిన దాన్ని హౌస్ మేట్స్ కొంతసేపు డీకోడ్ చేసే ప్రయత్నం చేశారు కానీ తరువాత లైట్ తీసుకున్నారు.
శివాజీ కన్ఫ్యూజన్ గేమ్
రణధీర టీమ్ దగ్గర ఉన్న కీ ను ఎలాగైనా కొట్టేయాలని మహాబలి టీం కష్టపడుతుంటే మరోవైపు వారి ప్లాన్ ను తిప్పికొట్టే పనిలో పడ్డారు రణదీర టీం. ముఖ్యంగా శివాజీ అయితే మైండ్ గేమ్ ఆడి అవతలి టీమ్ ను కన్ప్యూజ్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. హౌస్ లో అక్కడ ఉంది ఇక్కడ ఉంది అన్నట్టుగా కన్ఫ్యూజ్ చేస్తూ వాళ్ల ప్లాన్స్ ను తిప్పికొట్టి కీ ను ఎవరూ దొంగతనం చేయకుండా చూసుకున్నాడు.
సందీప్ ఫైర్
ఇక తన పవారాస్త్రను దొంగతనం చేశారని తెలుసుకున్న సందీప్ హౌస్ మేట్స్ పై ఫైర్ అయ్యాడు. ఇప్పటివరకూ చాలా కంపోజ్డ్ గా సైలంట్ గా ఉన్న సందీప్ ఒక్క సారిగా తనలోని పాత యాంగిల్ ను బయటకు తీసుకొచ్చాడు. కష్టపడి ఆడానని.. అలా తీయడం కరెక్ట్ కాదని అసహనం వ్యక్తం చేశారు. సందీప్ కు సపోర్ట్ గా శోభాశెట్టి, ప్రియాంక, అమర్ దీప్ కూడా పవరాస్త్రను ఇవ్వాలని కోరారు. మరోవైపు పవరాస్త్రను కొట్టేసిన శుభశ్రీ, రతిక, దామిని గ్యాంగ్ కూడా తమకు ఏం తెలియదు అన్నట్టు నటించేశారు.
ఇక మాయస్త్రలో భాగంగా బిగ్ బాస్ ఇచ్చిన రెండు టాస్కుల్లో రణధీర టీమ్ గెలవగా ఆ టామ్ కు మాయస్త్రను ఇచ్చాడు. మాయస్త్రలో ఉన్న ఆరు భాగాలను టీమ్ లోని ఆరుగురు సభ్యులు పంచుకుంటారు. ఇప్పుడు ఈ ఆరుగురికి మరో టాస్క్ ఇవ్వనున్నాడు బిగ్ బాస్.. మరి ఏ టాస్క్ ఇస్తాడు.. టాస్క్ లో ఎవరు గెలిచి ఈవారం ఎవరు ఇంటి సభ్యుడు అవుతారో తెలియాలంటే నేటి ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: