పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నది ప్రాజెక్ట్ కే సినిమా గురించి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఈసినిమా వస్తుంది. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఆ అంచనాలను మరింత రెట్టింపు చేశాడు నాగ్ ఆశ్విన్ ఈసినిమా నుండి రిలీజ్ చేసిన రెండు వీడియోస్ తో. స్క్రాచ్ నుండి టైర్ ను తయారు చేయడం.. స్క్రాచ్ నుంచి రైడర్స్ లుక్ ని ఎలా ప్రిపేర్ చేస్తున్నారో తెలుపుతూ వీడియోలు రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. జస్ట్ గ్లింప్సే ఈ రేంజ్ లో ఉంటే సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అని సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు ఆ అంచనాలను మరింత పెంచేశాడు రానా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రానా ఈసినిమా గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సౌతిండియాలో మేము ఒకరి సినిమాలను మరొకరం సెలబ్రేట్ చేసుకుంటాం. ఇప్పుడు నాగ్ ఆశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే సినిమా వస్తుంది.. ప్రభాస్, దీపికా, అమితాబ్ బచ్చన్ నటిస్తున్న సినిమా అది. ఆ సినిమా కోసం మేము చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. ఈ మూవీ ఖచ్చితంగా అన్ని సరిహద్దులను చెరిపేస్తుంది. అంతేకాదు ఇప్పటి వరకూ బాహుబలి, ఆర్ఆర్ఆర్ కానిది ప్రాజెక్ట్ కే సినిమాా వల్ల అవుతుంది.. నేను కూడా ఆ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను. ప్రాజెక్ట్ కే తెలుగు నుంచి ఓ గ్లోబల్ ఫిల్మ్ అవుతుందని నేను అనుకుంటున్నాను అంటూ తెలిపాడు.
కాగా ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తుంది. మరొక హీరోయిన్ బాలీవుడ్ యంగ్ బ్యూటీ దిశా పటానీ, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వనీదత్ దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి తోట రమణి ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. వచ్చే ఏడాది ఈసినిమాను రిలీజ్ చేసే అవకాశం ఉంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: