వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా బ్యానర్ పై బ్లాక్ బస్టర్ మహానటి మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా టైమ్ ట్రావెల్ నేపథ్యంలో భారీ బడ్జెట్ తో ప్రాజెక్ట్ K మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దీపిక పడుకొనే, దిశా పటానీ కథానాయికలు. ఈ మూవీలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రాజెక్ట్ Kమూవీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా అనౌన్స్ అయినా కూడా దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ ప్రాజెక్ట్ని పాన్ వరల్డ్ సినిమాగా హాలీవుడ్ స్థాయిలో సీనియర్ టెక్నీషియన్స్ తో తెరకెక్కిస్తున్నారు. టాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ఈ సినిమాకి మెంటర్గా వ్యవహరిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
భారీ అంచనాలు ఉన్న ప్రాజెక్ట్ K మూవీ రిలీజ్ కై ప్రేక్షక, అభిమానులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. తాజాగా ప్రాజెక్ట్ K మూవీ రిలీజ్ డేట్ ను మహాశివరాత్రి సందర్భంగా మేకర్స్ అనౌన్స్ చేశారు. సంక్రాంతి కానుకగా 2024 జనవరి 12న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ప్రకటిస్తూ మేకర్స్ ఒక కొత్త పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో భారీ ఆకారంలో ఉన్న చేతిపై కొందరు గన్స్ గురిపెడుతూ కనిపించడం ఆసక్తిని పెంచుతుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: