ఈమధ్య సినిమా ప్రమోషన్స్ ఎంత కొత్తగా ఉంటే ప్రేక్షకులకు అంత రీచ్ అవుతుంది ఆసినిమా. అందుకే మేకర్స్ కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఐడియాస్ తో వస్తుంటారు. సినిమాలపై బజ్ క్రియేట్ చేస్తుంటారు. ఇక ఇప్పుడు అక్కినేని వారసుడు అఖిల్ కూడా అదే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటి వరకూ లవర్ బాయ్ గా అలరించిన అఖిల్ ఇప్పుడు యాక్షన్ ఎంటర్ తో వచ్చేస్తున్నాడు ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది. ఈ సినిమాను ఏప్రిల్ 28న విడుదల చేస్తున్నట్టు ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా రిలీజ్కు చాలా రోజులు ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే ఈ సినిమా ప్రమోషన్స్ జోరు పెంచే పనిలో పడ్డారు మేకర్స్. ఈనేపథ్యంలోనే ఫ్యాన్స్ కోసం అఖిల్ ఓ నిర్ణయం తీసుకున్నాడు. ఫిబ్రవరి 22న ట్విట్టర్ స్పేస్ లో అభిమానులతో మాట్లాడబోతున్నాడు అఖిల్. ఈ విషయాన్ని అఫీషియల్గా ప్రకటించారు చిత్రబృందం. ఈ సందర్భంగా ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.
కాగా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఎ.కె.ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై అనీల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే వక్కంతం వంశీ అందించాడు. హిప్ హాప్ తమీజా సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా రగుల్ హెరియన్ ధరుమన్ వ్యవహరిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: