టాలీవుడ్ లో ఉన్న బెస్ట్ కపుల్స్ లిస్ట్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు-నమ్రత శిరోద్కర్ ల పేర్లు ఎప్పుడూ ముందుంటాయి. మహేష్-నమ్రత ను చూసిన వారు లవబుల్ కపుల్ అంటూ కామెంట్ చేస్తుంటారు. 2000వ సంవత్సరంలో వచ్చిన వంశీ సినిమాలో మహేష్, నమ్రత కలిసి నటించారు. ఆ సినిమాతో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారి 2005 లో వివాహం చేసుకున్నారు. వీరి వివాహబంధానికి నేటితో 18 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా మహేష్, నమ్రతా ఇద్దరూ తమ సోషల్ మీడియా ద్వారా త్రో బ్యాక్ ఫొటోస్ షేరు చేస్తూ పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం ఈఫొటోలు వైరల్ గా మారుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
View this post on Instagram
మహేష్ బాబు తన సినిమాలతో బిజీగా ఉంటూనే మరోపక్క ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో అందరికీ తెలిసిందే. ఇక నమ్రత కూడా ఒకపక్క ఇంట్లో వ్యవహారాలు చూస్తూనే మరోపక్క మహేష్ కు సంబంధించిన అన్ని వ్యవహారాలు కూడా చూసుకుంటూ ఉంటారు. మహేష్ తో వివాహం అనంతరం తన పూర్తి సమయాన్ని భర్త పిల్లలను చూసుకోవడానికి, మహేష్ వ్యాపార భాద్యతలు చూసుకోవడంతో గడుపుతున్నారు నమ్రత. ఇలా ఇద్దరూ ఒకరికొకరు సపోర్ట్ గా ఉంటూరు కాబట్టే టాలీవుడ్ లో ఉన్న అన్యోన్య దంపతుల్లో ఒకరిగా ఉన్నారు.
View this post on Instagram
ఇక ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు. ఈసినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే నటిస్తుంది. దీనితో పాటు మధి కెమెరామెన్గా, నవీన్ నూలి ఎడిటర్గా, థమన్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్పై ఎస్.రాధాకృష్ణ ఈసినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను ముగించుకునే పనిలో ఉంది. ఇక రాజమౌళి తో కూడా మహేష్ బాబు ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. మరి మహేష్ ఈసినిమా ముందు మరేదైనా సినిమా చేస్తాడా లేక త్రివిక్రమ్ సినిమా తరువాత చేస్తాడా అన్నది చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: