నందమూరి తారకరత్న అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం టీడీపీ యువనేత, చంద్రబాబు తనయుడు లోకేష్ యువగళం పేరుతో పాదయాత్రను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే కదా. ఇక ఈకార్యక్రమంలో తారకరత్న కూడా పాల్గొన్నారు. అయితే అక్కడే పాదయాత్ర చేస్తున్న సమయంలోనే తారకరత్న కు మైల్డ్ స్ట్రోక్ రావడంతో వెంటనే కుప్పంలోని ఆస్పత్రికి తరలించారు. కుప్పం పీఈఎస్ సూపర్ స్పెషాలిటీస్ ఆసుపత్రిలో చికిత్స చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఆయనను మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించినట్టు తెలుస్తుంది. బెంగుళూరులోని నారాయణ హృదాలయ నారాయణ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. త్వరలోనే హెల్త్ అప్ డేట్ అవ్వనున్నట్టు సమాచారం. ఇక మరోవైపు తారకరత్న ఆరోగ్యంపై ఆసుపత్రి నుంచి వచ్చే హెల్త్ బులెటిన్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.
కాగా నందమూరి వారసత్వంతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నటుల్లో తారకరత్న కూడా ఒకరు. ఒకటో నంబర్ కుర్రాడు అనే సినిమాతో 2002 లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ సినిమా మంచి విజయాన్నే అందించింది. ఇక ఆతరువాత ‘యువరత్న’, ‘తారక్’, ‘భద్రాది రాముడు’, ‘నందీశ్వరుడు’ వంటి సినిమాల్లో నటించారు. ప్రస్తుతం అయితే ఆయన సినిమాలకు దూరంగానే ఉన్నారు. కానీ అప్పుడప్పుడు పలు సినిమాల్లో నటిస్తూ కనిపిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: