ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ప్రారంభం అయిన విషయం తెలిసిందే. క్రిస్మస్ వేడుకలకై మెగా ఫ్యామిలీ మొత్తం ఒక చోటికి చేరుకున్నారు. ఏ పండగ వచ్చినా, మెగాహీరోలు అంత ఒక చోటు చేరి సందడి చేస్తుంటారు. ఈ కార్యక్రమంలో రామ్ చరణ్-ఉపాసన, అల్లు అర్జున్-స్నేహా రెడ్డి, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్, వైష్ణవ్ తేజ్, సుస్మిత, శ్రీజ, నిహారిక తదితరులు పాల్గొన్నారు.తాజాగా క్రిస్మస్ వేడుకల్లో భాగంగా సీక్రెట్ శాంటా ఈవెంట్ ని జరుపుకున్నారు .
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఒకరికి ఒకరు సీక్రెట్ గిఫ్ట్స్ ఇచ్చుపుచ్చుకోవడం సీక్రెట్ శాంటా అంటారు. దీంతో నిన్న మెగా కజిన్స్ అందరూ ఇందులో పాల్గొని ఒకరికి ఒకరు గిఫ్ట్స్ అందజేసుకున్నారు. ఇక ఈ ఈవెంట్ లో అందరూ కలిసి దిగిన ఫోటోను ఉపాసన తన ఇన్స్టాగ్రామ్ ద్వారా పోస్ట్ చేశారు. ఆ ఫొటోలో మెగాహీరోలు అందర్నీ ఒకచోట చూసిన అభిమానులకి కన్నుల విందుగా ఉంది. అయితే ఈ ఈవెంట్ లో చిరంజీవి పాల్గొనలేదు.
ఇటీవలే రామ్ చరణ్ అండ్ ఉపాసన అమ్మానాన్నలు కాబోతున్నట్లు చిరంజీవి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలిసిన తరువాత మెగాహీరోలు అంతా ఒకచోట కలవడం ఇదే తొలిసారి. మెగా వారసుడు రాకతో మెగా కుటుంబం మధ్య మరింత ఆనందం నెలకొంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: