అల్లరి నరేష్ హీరోగా ఏఆర్ మోహన్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం. ఈసినిమాలో నరేష్ ఎలక్షన్ అధికారిగా కనిపించనున్నాడు. ఇక ఈసినిమా నవంబర్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ కు కొద్ది రోజులు మాత్రమే ఉండటంతో సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేయడానికి చూస్తున్నారు. దీనిలో భాగంగానే తాజాగా ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసందర్భంగా అల్లరి నరేష్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో 90 శాతం కథ అడవిలోనే జరుగుతుంది. 55 రోజుల్లో ఈ సినిమా షూటింగును పూర్తిచేశాము. అబ్బూరి రవిగారు ఈ సినిమాకి మాటలు రాశారు. మారేడుమిల్లి ఫారెస్టు ప్రాంతంలోని వారి యాసను పట్టుకుని, అందుకు తగినట్టుగా డైలాగ్స్ రాయడానికి ఆయన చాలా కష్టపడ్డారు. ఇక దర్శక నిర్మాతలిద్దరూ ఈ సినిమాతోనే పరిచయమవుతున్నారు. ఈ సినిమా కోసం 250 మంది ఎంతో కష్టపడ్డారు. కొండలు ఎక్కడానికి మూడు గంటలు .. దిగడానికి మూడు గంటలు పట్టేది. అది అనుకున్నంత ఈజీ కాదు. ఈ సినిమా చాలా సీరియస్ గా ఉంటుందని అనుకుంటారు. కానీ ఇందులో చాలా కామెడీ ఉంటుంది.. అలానే ఎమోషన్ కూడా ఉంటుంది అని చెప్పుకొచ్చారు. మరి చూద్దాం ఈసినిమా నరేష్ కు ఎలాంటి సక్సెస్ ను అందిస్తుందో..
కాగా ఆనంది ఈసినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా.. వెన్నెల కిషోర్, చమ్మక్ చంద్ర ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ సమర్పణలో హాస్య మూవీస్ బ్యానర్పై రాజేష్ దండ ఈసినిమాను నిర్మిస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈసినిమాకు రామ్ రెడ్డి సినిమాటోగ్రాఫర్.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: