నవంబర్ 1వ తేదీన కర్ణాటక రాజ్యోత్సవ వేడుకకు కర్ణాటక ప్రభుత్వం నుండి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రత్యేక ఆహ్వానం అందుకున్న విషయం తెలిసిందే.ప్రముఖ సినీ నటుడిగానే కాక సేవా రంగంలోనూ తనదైన ప్రత్యేకతను చాటుకున్న దివంగత పునీత్ రాజ్కుమార్ ను కర్ణాటక రత్న పురస్కారానికి కర్ణాటక ప్రభుత్వం ఎంపిక చేసింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రత్యేక అతిథిగా హాజరయిన కర్ణాటక రాజ్యోత్సవ వేడుకకు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్, కన్నడ స్టార్ యాక్టర్ శివ రాజ్ కుమార్, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్ పర్సన్ సుధా మూర్తి సహా మరికొందరు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ದಿ. ಪುನೀತ್ ರಾಜಕುಮಾರ್ ಅವರಿಗೆ ಕರ್ನಾಟಕ ರತ್ನ ಪ್ರಶಸ್ತಿ ಪ್ರದಾನ ಕಾರ್ಯಕ್ರಮ.#PuneetRajkumar #ಕರ್ನಾಟಕರತ್ನ https://t.co/V5mOW5h197
— Basavaraj S Bommai (@BSBommai) November 1, 2022
కర్ణాటక రాజ్యోత్సవ వేడుక సమయంలో వర్షం పడడంతో సభలో అతిథుల కోసం ఏర్పాటు చేసిన కుర్చీలు తడిసిపోయాయి. అది గమనించిన ఎన్టీఆర్ ఓ కుర్చీని బట్టతో తుడిచి పునీత్ రాజ్కుమార్ భార్య అశ్వినిని కూర్చోబెట్టారు. ఆ తర్వాత మరో కుర్చీలో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్ పర్సన్ సుధామూర్తిని కూర్చోమని చెప్పి , మహిళల పై గౌరవాన్ని చాటుకున్నారు. అనంతరం తన కుర్చీని కూడా తానే క్లీన్ చేసుకుని కూర్చున్నారు.ఎన్టీఆర్ సింప్లిసిటీకి కన్నడ అభిమానులు ఫిదా అయిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కర్ణాటక రత్నపురస్కారాన్ని పునీత్ రాజ్ కుమార్ సతీమణి అశ్విని గారికి సూపర్ స్టార్ రజినీకాంత్ తో కలిసి ఎన్టీఆర్ అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: