రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతి చెందిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మొన్న తుది శ్వాస విడిచారు. ఇక ఆయన అంత్యక్రియలు నిన్న జరిపారు. జూబ్లీహిల్స్ నుండి కనకమామిడి ఫాంహౌస్ వరకు కొనసాగిన అంతిమయాత్రలో ఎంతోమంది జనం పాల్గొన్నారు. తమ అభిమాన నటుడిని చివరిసారి చూసేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేశారు. ఇక మరోవైపు అందరూ కృష్ణంరాజు గురించి తమ జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈనేపథ్యంలోనే డైరెక్టర్ రాధాకృష్ణ కూడా కృష్ణంరాజు గురించి గుర్తుచేసుకున్నాడు. రాధాకృష్ణ దర్శకత్వంలో వచ్చిన రాధేశ్యామ్ సినిమాలో కృష్ణంరాజు కూడా ఒక కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే కదా. ఆధ్యాత్మిక గురువు పరమహంస పాత్రలో కృష్ణంరాజు నటించారు. అయితే ఈపాత్రలో పలు భాషల్లో పలువురు నటులు నటించగా.. తెలుగులో మాత్రం కృష్ణంరాజు గారు నటించాలని ప్రభాస్ కోరాడని తెలిపారు. కృష్ణంరాజు గారి వయసు 82 సంవత్సరాలు.. ఈ వయసులో వర్క్ చేయడం ఎంత కష్టమోప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. కానీ సినిమా పట్ల ఆయనకు ఉన్న కమిట్ మెంట్, ప్యాషన్ చూసి సెట్లో అందరూ షాక్ అయ్యారు. ఇక ఈసినిమాలో ఒక సన్నివేశం ఉంటుంది.. నేను ఇప్పటి వరకూ ఎంతో మంది గొప్ప వ్యక్తుల చేతి రేఖలు చూశాను.. నేను ఎప్పటి వరకూ బ్రతికి ఉంటానో తెలియదు చివరిగా నీ చేయి చూడాలనుకుంటున్నాను అంటూ ప్రభాస్ తో అంటాడు. ఇప్పుడు ఆ డైలాగ్ గుర్తుచేసుకుంటే గుండె ఎంతో భారంగా ఉంది.. ఆ సీన్ చేస్తున్నప్పుడు ప్రభాస్ కూడా ఎంతో ఎమోషనల్ అవ్వడమే కాదు.. ప్రభాస్ కళ్లు చెమర్చాయి కూడా అంటూ రాధాకృష్ణ గుర్తుచేసుకున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: