సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా కొత్త సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. అతడు, ఖలేజా సినిమాల తరువాత దాదాపు 12 ఏళ్ల తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. ఇక ఈసినిమా కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూాశారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సర్కారు వారి పాట సినిమా రిలీజ్ అయి చాలా కాలం అయినా కూడా ఈసినిమా సెట్స్ పైకి వెళ్లడానికి చాలా టైమ్ పట్టింది. ఫైనల్ గా నిన్ననే ఈసినిమా షూటింగ్ ను ప్రారంభించారు మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసందర్భంగా సెట్స్లో మహేష్ బాబుతో త్రివిక్రమ్ మాట్లాడుతున్న పిక్ను రిలీజ్ చేశారు. ఆ ఫొటోను చూస్తే.. సీన్ వివరిస్తున్నట్లు ఉంది. అంతేకాదు మరో గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఫస్ట్ డే షూటింగ్ కు సంబంధించిన గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈవీడియోలో త్రివిక్రమ్, మహేష్ బాబు సెట్స్ కు రావడం.. ఇంకా మేకర్స్ కూడా సెట్స్ లో ఉండటం చూపించారు.
High Octane Entertainer #SSMB28 shoot begins today 🔥
Blockbuster & Magical combination of SUPERSTAR @urstrulymahesh & our Darling Director #Trivikram garu is all set to ABLAZE you at theatres! 🤩#SSMB28Aarambham
On to the screens 28th April, 2023!
— Haarika & Hassine Creations (@haarikahassine) September 12, 2022
కాగా ఈసినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే నటిస్తుంది. దీనితో పాటు మధి కెమెరామెన్గా, నవీన్ నూలి ఎడిటర్గా, థమన్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్పై ఎస్.రాధాకృష్ణ ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈసినిమా రిలీజ్ డేట్ కూడా ముందే ప్రకటించారు. 2023 ఏప్రిల్ 28వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: