కీరవాణి వారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు తనయులు కాలభైరవ, శ్రీ సింహా. ఒకరు మ్యూజిక్ డైరెక్టర్ గా రాణిస్తుండగా.. మరొకరు హీరోగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నారు. ‘మత్తు వదలరా’ చిత్రంతో హీరోగా పరిచయమైన శ్రీసింహా మొదటిసినిమాతోనే ఆకట్టుకున్నాడు శ్రీసింహా. ప్రస్తుతం అయితే తను చేస్తున్న దొంగలున్నారు జాగ్రత్త సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. ఒక దొంగతనం బెడిసికొట్టిన తర్వాత ఒక దొంగ జీవితం ఊహించిన మలుపులు తీరుగుతుంది. తర్వాత అతని జీవితం శాశ్వతంగా ఎలా మారిపోయిందో ఆసక్తికరంగా చూపించబోతున్నారు. ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ముగించుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 23న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. అనౌన్స్ మెంట్ పోస్టర్ లో ఒకవైపు సింహ కోడూరి, మరో వైపు సముద్రఖని ఒకే మొహంగా కనిపించడం ఆసక్తికరంగా వుంది.
కాగా సతీష్ త్రిపుర ఈ మూవీతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ప్రీతి ఆస్రాని హీరోయిన్గా నటిస్తున్న ఈసినిమాలో సముద్రఖని కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా ‘‘దొంగలున్నారు జాగ్రత్త’’ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. రోహిత్ కులకర్ణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. యశ్వంత్ సి సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. మరి ఈసారి దొంగగా మారిన శ్రీ సింహా ఎంతవరకూ ఆకట్టుకుంటాడో చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: