పి.వాసు దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్, జ్యోతిక, నయనతార ప్రధాన పాత్రల్లో వచ్చిన చంద్రముఖి సినిమా ఏ రేంజ్లో హిట్ అయిందో అందరికి తెలుసు. అప్పట్లో ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. రజనీ స్టైల్కు, జ్యోతిక నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇక ఇప్పుడు చంద్రముఖి సినిమాకు త్వరలో సీక్వెల్ రాబోతున్న సంగతి కూడా తెలిసిందే. ఇక ఈసినిమాను మాతృకకు దర్శకత్వం వహించిన పి.వాసునే దర్శకత్వం వహించనున్నాడు. రజనీ ప్లేస్ లో లారెన్స్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజా సమాచారం ప్రకారం ఈసినిమా ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది. రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ ను స్టార్ట్ చేశారు చిత్రబృందం. ఈసినిమా ఫస్ట్ షెడ్యూల్ ను కేరళ, మైసూర్ లోని న్యాచురల్ లొకేషన్స్ లో చిత్రీకరించినట్టు తెలుస్తుంది. అక్కడ లీడ్ పాత్రలతో పలు కీలక సన్నివేశాలను తెరకెక్కించగా ఇప్పుడు ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్నట్టు చెబుతున్నారు.
ఇక ఈసినిమాలో ఐదుగురు హీరోయిన్లు నటిస్తున్నారు. లక్ష్మీ మీనన్, మహిమా నంబియర్, మంజిమ మోహన్, శృతి దాంగే ఇంకా సుభిక్షా కృష్ణన్ నటిస్తున్నారు. చంద్రముఖి సినిమాలో నటించిన వడివేలు కూడా ఈసినిమాలో కీలక పాత్రలో నటించనున్నాడు. టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్.ఎమ్ కీరవాణి సంగీతం అందించనున్నారు. ఆర్.జీ రాజశేఖర్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: