శ్రీమతి మమత సమర్పణ లో హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా #SSMB 28 ” మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. పూజా హెగ్డే కథానాయిక. “అతడు “, “ఖలేజా ” మూవీస్ తరువాత వారిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కుతున్న #SSMB 28 ”మూవీ పూజా కార్యక్రమం తో ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఈ పూజా కార్యక్రమానికి మహేష్ బాబు సతీమణి నమ్రత , హీరోయిన్ పూజాహెగ్డే హాజరు అయ్యారు. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న “#SSMB 28″మూవీకి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరో మహేష్ , దర్శకుడు త్రివిక్రమ్ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ అయ్యాయనీ, మహేష్ గారు, త్రివిక్రమ్ గారితో సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడానికి, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సినిమాకి మా ప్రయాణం మొదలైందనీ సంగీత దర్శకుడు థమన్ ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ చేశారు. “#SSMB 28” మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం మహేష్ బాబు విదేశాల్లో ఉన్నారు. ఆయన తిరిగొచ్చిన తర్వాత షూటింగ్ స్టార్ట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: