టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ మేజర్ తో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. శశి కిరణ్ తిక్క, అడివి శేష్ దర్శకత్వంలో వచ్చిన గూఢచారి సినిమా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు అదే కాంబినేషన్ లో మేజర్ సినిమా తెరకెక్కించి మరో హిట్ ను సొంతం చేసుకున్నారు. మేజర్ ఉన్నికృష్ణన్ బయోపిక్ ను తీసి అందరి చేత ప్రశంసలు అందుకున్నారు. ఈసినిమాను ఒక సినిమాలా కాకుండా ఒక ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు అందరూ. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో అడివిశేష్ నటన అందరినీ ఆకట్టుకుంది. అందుకే ఇక్కడ మాత్రమే కాదు దేశవ్యాప్తంగా అలానే విదేశాల్లో కూడా మేజర్ కు అందరూ ఫిదా అయిపోయారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా రిలీజ్ అయి 13 రోజులు అయిపోయింది. ఈ 13 రోజుల్లో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 30 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టినట్టు తెలుస్తుంది. అలానే ఏపీ, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈసినిమా 17 కోట్లకు పైగా కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఇక బాలీవుడ్ లో కూడా మేజర్ సినిమాకు మంచి క్రేజ్ ఉంది. సినిమా రిలీజ్ కు ముందే ఈ చిత్రం ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ను తెచ్చుకుంది. ఇక హిందీలో కూడా ఈసినిమా మంచి కలెక్షన్స్ ను రాబడుతుంది.
కాగా ఈ సినిమాను జీఎంబీ ఎంటర్టైనమెంట్స్ లో సూపర్ స్టార్ మహేష్ బాబ తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా, ఏప్లస్ఎయస్ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. అడివిశేష్కు జోడీగా సాయి మంజ్రేకర్ హీరోయిన్గా నటించింది. ఇంకా ఈసినిమాలో ప్రకాష్ రాజ్, రేవతి, శోభితా ధూళిపాళ కీలక పాత్రల్లో నటించారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: