జయం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరో నితిన్. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్నాడు. ఆ తరువాత దిల్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ కొట్టి మంచి ఫామ్ లోకి వచ్చాడు. అయితే ఆ తరువాత సంబరం. శ్రీ ఆంజనేయం లాంటి సినిమాలు చేసి ఫ్లాప్స్ ను మూట గట్టుకున్నాడు.అలాంటి సమయంలోనే రాజమౌళి తో చేసే అవకాశం దక్కించుకున్నాడు. సై సినిమాతో హిట్ కొట్టి మళ్లీ పుంజుకున్నాడు. అయితే అది కూడా ఎన్నో రోజులు నిలువలేదు. ఒకటి కాదు రెండు కాదు దాదాపు డజనుకు పైగా సినిమాలు నితిన్ కు పరాజయాన్ని అందించాయి. అయినా కూడా ఎలాంటి నిరాశ చెందకుండా ధైర్యంతో సినిమాలు చేసుకుంటూ ప్రేక్షకులను అలరిస్తూనే వచ్చాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అప్పుడే విక్రమ్ కుమార్ తో ఇష్క్ సినిమా వచ్చింది. ఆ సినిమాతో మళ్లీ నితిన్ కు జీవం వచ్చినట్టైంది. ఎన్నో ఏళ్ల తరువాత ఇష్క్ తో విజయం అందుకున్నాడు. ఆ తరువాత వెంటనే గుండెజారి గల్లంతయ్యిందే అంటూ మరో విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక వరుసగా రెండు హిట్లు అందుకున్నాడో లేదో మళ్లీ ఫ్లాప్స్ మొదలయ్యాయి. త్రివిక్రమ్ తో అ..ఆ సినిమా హిట్ ఆ తరువాత మళ్లీ ఫ్లాప్స్.. ఈ తరువాత భీష్మతో సాలిడ్ హిట్ కొట్టడం జరిగింది. ఇలా ఒక సినిమా హిట్ అయితే రెండు సినిమాలు ఫ్లాప్స్ ను సొంతం చేసుకుంటూ తన జర్నీని కొనసాగిస్తున్నాడు నితిన్.
ఇక నేటితో నితిన్ రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్నాడు. ఈసందర్భంగా తన సోషల్ మీడియా ద్వారా ఎమోషనల్ మెసేజ్ ను పంచుకున్నాడు. 20 ఏళ్ల కితం జయం సినిమాతో నా సినీ ప్రయాణం స్టార్ట్ చేశాను. ఇప్పుడు నేనేం చెప్పాలో కూడా మాటలు రావట్లేదు, మొదటగా నన్ను నమ్మి నటునిగా వెండితెరకి పరిచయం చేసిన దర్శకుడు తేజ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా మిగతా దర్శకులు, నిర్మాతలు, నటులు, టెక్నీషియన్స్ ఇలా నేను పని చేసిన సినిమాకి ప్రతి ఒక్కరికి థాంక్స్ చెప్తున్నాను. ముఖ్యంగా ఇన్నేళ్ళుగా నన్ను అభిమానిస్తూ నన్నే ఫాలో అవుతూ చెరగని ప్రేమని అందిస్తున్న అభిమానుల ప్రేమకి అయితే ఎప్పటికీ హృదయపూర్వకంగా ఋణపడి ఉంటాను” అని పోస్ట్ లో పేర్కొన్నాడు.
❤️❤️❤️ pic.twitter.com/WbhRMZMac3
— nithiin (@actor_nithiin) June 14, 2022
ఇక ప్రస్తుతం ఎం.ఎస్.రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో నితిన్ హీరోగా వస్తున్న పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘మాచర్ల నియోజకవర్గం’. ఇక ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తిచేసుకునే పనిలో ఉంది. ఈ సినిమాలో నితిన్ సరసన కృతి శెట్టి, కేథరిన్ థెరిస్సా హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాజ్ కుమార్ ఆకెళ్ళ సమర్పణ లో ,ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్టైన్మెంట్స్, శ్రేష్ట్ మూవీస్ బ్యానర్స్ పై ఈ చిత్రాన్ని సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు. మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: