తమిళ్ స్టార్ హీరో విజయ్కు తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. అందుకే తన సినిమాలను తెలుగులో కూడా రిలీజ్ చేస్తుంటారు. ఇక ఇప్పుడు ఏకంగా డైరెక్ట్ గా తెలుగులోనే సినిమా చేస్తున్నాడు. ఈసినిమాకు స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వహిస్తున్నారు. మహర్షి లాంటి సూపర్ హిట్ సినిమా తరువాత వంశీ చేస్తున్న సినిమా అవ్వడం.. అందులోనూ విజయ్ హీరోగా చేస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమవ్వగా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈసినిమా షూటింగ్ నిమిత్తం హైద్రాబాద్ చేరుకున్నారు విజయ్. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వచ్చిన విజయ్ ప్రగతిభవన్లో కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. హీరో విజయ్తోపాటు దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా ఉన్నారు. హీరో విజయ్ను సీఎం కేసీఆర్ శాలువాతో సన్మానించారు. ఇక ముఖ్యమంత్రిని కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందంటూ విజయ్-వంశీ తెలిపారు. మరి కేసీఆర్ ను గౌరవపూర్వకంగా కలిశారా లేక వేరే ఏదైనా ఉందా అన్న దానిపై క్లారిటీ లేదు.
కాగా ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో తెలుగు, తమిళ్ లో తెరకెక్కిస్తున్నారు. ఈసినిమాలో విజయ్ కు జోడీగా ప్రస్తుతం ఫుల్ క్రేజ్ తో ఉన్న రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇతర నటీనటులకు సంబంధించిన వివరాలు చిత్రయూనిట్ త్వరలో తెలియచేయనున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: