సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సినిమా “సర్కారు వారి పాట”. పరుశురామ్ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమా పై మొదటి నుండీ భారీ అంచనాలు ఉన్నాయి. బ్యాంకు కంభకోణాల నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా వస్తుండటం.. అంతేకాకుండా ఈసినిమాలో మహేష్ అల్ట్రా పాష్ లుక్ లోకి వచ్చేయడంతో ఫ్యాన్స్ మహేష్ ను ఎప్పుడు స్క్రీన్ పై చూద్దామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే ఈసినిమా నుండి వస్తున్న అప్ డేట్స్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. ఇక రీసెంట్ గా వచ్చిన టైటిల్ సాంగ్ కూడా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుంది. తాజాగా ఈసినిమా గురించి ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ కూడా పలు ఆసక్తికర విషయాలు తెలియచేశారు. సర్కారు వారి పాట యాక్షన్ ఇంకా ఎంటర్ టైనర్ తో కూడిన పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్.. నేను మహేష్ బాబు గారితో దూకుడు సినిమా నుండి ట్రావెల్ చేస్తున్నా.. ఆయనతో నేను చేస్తున్న ఏడో సినిమా సర్కారు వారి పాట.. ఈసినిమాలో రెండు పాటలు కంప్లీట్ గా సెట్స్ లో తీసినవే.. ఆడియన్స్ కు ఖచ్చితంగా ఈ రెండు పాటలు చూడటానికి ఐ ఫీస్ట్ లా ఉంటాయి అని తెలిపారు.
కాగా ఈసినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా.. వెన్నెల కిషోర్, సముద్రఖని కూడా ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, GMB ఎంటర్టైన్మెంట్ మరియు 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తుండగా.. ఆర్ మధి సినిమాటోగ్రఫీ, ఏ ఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: