ఒకప్పుడు కమర్షియల్ సినిమాలకే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించే హీరోలు ఇప్పుడు కొత్త ప్రయోగాలు చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తమ పాత్ర ఎంత డిఫరెంట్ గా ఉంది అన్నది మాత్రమే చూసుకుంటున్నారు. ఇక అల్లరి నరేష్ కూడా ఇప్పుడు అదే చేస్తున్నాడు. ఒకప్పుడు కామెడీ కథా చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన అల్లరి నరేష్ ఇప్పుడు పాత్ర ప్రధానమైన సినిమాలు చేయడానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. చాలా కాలం సరైన హిట్ లేక బాధపడుతున్న అల్లరి నరేష్ మహేష్ మహర్షి సినిమాలో మంచి రోల్ చేసి ప్రశంసలు దక్కించుకున్నాడు. ఆ తరువాత నాంది లాంటి సినిమాలో ఛాలెంజింగ్ రోల్ లో చేసి మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఇక ఇప్పుడు మరో డిఫరెంట్ కథతో వస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మోహన్ దర్శకత్వంలో అల్లరి నరేష్ ఒక సినిమా చేస్తున్నాడు. ఈసినిమాను ఎప్పుడో ప్రకటించారు కూడా మేకర్స్. ఇప్పటి వరకూ టైటిల్ ఫిక్స్ చేయకుండానే ఈసినిమా షూటింగ్ ను స్టార్ట్ చేశారు చిత్రయూనిట్. అయితే తాజాగా ఈసినిమా టైటిల్ ను రిలీజ్ చేశారు. ‘ఇట్లు మారేడు మిల్లి ప్రజానీకం’ అనే టైటిల్ ను ఈసినిమాకు ఫిక్స్ చేశారు. ఇక టైటిల్ ఇంట్రెస్టింగ్ గా ఉండటమే కాకుండా.. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీగా వస్తున్నట్టు తెలుస్తుంది.
On this auspicious Sri Rama Navami, blessed to share with you the title of my next #ItluMaredumilliPrajaneekam #Naresh59 #IMP @raajmohan73 🎬@anandhiactress @ZeeStudios_ @HasyaMovies @RajeshDanda_ @vennelakishore @lemonsprasad @_balajigutta @abburiravi @SricharanPakala pic.twitter.com/Pu1uHvA2FL
— Allari Naresh (@allarinaresh) April 10, 2022
కాగా ఆనంది ఈసినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా.. వెన్నెల కిషోర్, చమ్మక్ చంద్ర ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ సమర్పణలో హాస్య మూవీస్ బ్యానర్పై రాజేష్ దండ ఈసినిమాను నిర్మిస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈసినిమాకు రామ్ రెడ్డి సినిమాటోగ్రాఫర్.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: