కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా ఆచార్య. ఈసినిమా కోసం మెగా అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిరు-చరణ్ ఇద్దరూ నటిస్తున్న సినిమా అవ్వడంతో వీరిద్దరిని సిల్వర్ స్క్రీన్ పై ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే గత ఏడాదే రిలీజ్ కావాల్సిన సినిమా కరోనా వల్ల లేట్ అయిపోయింది. ఇక ఫైనల్ గా ఈసినిమా ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో మేకర్స్ మళ్లీ ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు. ఇక ఇప్పటివరకూ ఈసినిమా నుండి పలు పాటలు, టీజర్ రిలీజ్ చేయగా అవి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా నుండి ట్రైలర్ ఎప్పుడు వస్తుందా అని మెగా ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేక్షకులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఆ ఎదురుచూపులకు కాస్త బ్రేక్ పడింది. తాజాగా ఈసినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. ఏప్రిల్ 12వ తేదీన ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
The date is set for the arrival of the MEGA PHENOMENA 🔥🔥
Witness the Mighty #AcharyaTrailer on 12th April 💥💥#AcharyaOnApr29
Megastar @KChiruTweets @AlwaysRamCharan #Sivakoratala @MsKajalAggarwal @hegdepooja #ManiSharma @MatineeEnt @KonidelaPro @adityamusic pic.twitter.com/84fP1bXa2k
— Matinee Entertainment (@MatineeEnt) April 9, 2022
కాాగా ఈసినిమాలో చిరుకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. చరణ్ సరసన పూజా హెగ్డే
కనిపించనుంది. నిరంజన్ రెడ్డితో కలిసి రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: