ఇటీవలే అఖండ సినిమాతో బాక్సాఫీస్ ను బద్దలుకొట్టిన బాలకృష్ణ ఇప్పుడు వెంటనే తన నెక్ట్స్ సినిమాపై ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్ మలినేనితో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వాస్తవ సంఘటనల ఆధారంగా మాస్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా గోపీచంద్ ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. ఇక ఈసినిమాలో కూడా బాలకృష్ణ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈసినిమాలో శాండిల్ వుడ్ సెన్సేషన్ దునియా విజయ్ ను తీసుకుంటున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ వార్తలను నిజం చేస్తూ ఇటీవలే దీనిపై అధికారిక ప్రకటన కూడా ఇచ్చారు మేకర్స్. ఇప్పుడు తాజాగా ఆయన పాత్రను పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈసినిమాలో ముసలిమడుగు ప్రతాప్ రెడ్డి అన్న పాత్రలో నటిస్తున్నాడు విజయ్. ఇక పోస్టర్ చూస్తుంటే ఈసినిమాలో మంచి పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నట్టు అర్థమవుతుంది. కాగా కన్నడంలో దునియా సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నాడు విజయ్. దాంతో దునియా విజయ్ అయ్యాడు.
Introducing Sandalwood Sensation @OfficialViji in a Powerful role, #MusaliMaduguPratapReddy 🔥🔥
As said, he redefines the Villainism in #NBK107 🦁
‘Natasimham’ #NandamuriBalakrishna @shrutihaasan @varusarath5 @MusicThaman @MythriOfficial pic.twitter.com/vlStPIhVG2
— Gopichandh Malineni (@megopichand) March 16, 2022
కాగా ఈసినిమాలో శృతీ హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. వరలక్ష్మీ శరత్ కుమార్ కూడా ఈసినిమాలో కీలకపాత్రలో నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యాన్సర్ పై నవీన్ యెర్నేని, వై రవి శంకర్ కలిసి ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు సినిమాటోగ్రఫి రిషి పంజాబీ అందిస్తున్నాడు. సాయి మాధవ్ బుర్రా మాటలు అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: