ఆంధ్ర ప్రదేశ్ సి ఎం జగన్ తో టాలీవుడ్ హీరోలు టికెట్ రేట్స్ , స్పెషల్ షో లకై చర్చలు జరిపిన విషయం తెలిసిందే. చర్చల తరువాత రాష్ట్ర ప్రభుత్వం తెలుగు చిత్ర పరిశ్రమ అభ్యర్థనలకు సానుకూలంగా స్పందించి పెంచిన టికెట్ రేట్స్ తో కొత్త జీవో విడుదల చేసింది.తెలుగు సినిమా పరిశ్రమకు మేలు కలిగే విధంగాసినిమా టికెట్ రేట్స్ సవరిస్తూ.. సరికొత్త జీవో జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్గారికి చిత్ర పరిశ్రమ తరపున కృతజ్ఞతలనీ , చిన్న సినిమాకు ఐదవ షో అవకాశం కల్పించడం ఎందరో నిర్మాతలకు ఉపయోగపడే అంశం అనీ , సంబంధిత మంత్రివర్యులు పేర్ని నానిగారికి, అధికారులకి, కమిటీకి ధన్యవాదాలనీ చిరంజీవి ట్వీట్ చేశారు.పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా సీఎం జగన్కు థ్యాంక్స్ చెబుతూ ట్వీట్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కొత్త జీవో పై సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా ద్వారా స్పందించారు. చిత్ర పరిశ్రమకు మేలు కలిగేలా సినిమా టికెట్ల రేట్లను సవరిస్తూ కొత్త జీవో ఇచ్చినందుకు గాను సీఎం జగన్కు ప్రత్యేకంగా ధన్యవాదాలనీ, తెలుగు సినీ పరిశ్రమ, ఏపీ సీఎం మధ్య వారధిలా వ్యవహరించిన ఏపీ మంత్రి పేర్ని నానికి కూడా కృతజ్ఞతలనీ , మునుముందు ఏపీ ప్రభుత్వం, సినీ పరిశ్రమ మధ్య మరింత మెరుగైన సంబంధాలు నెలకొనేలా ముందుకు సాగుతామనీ మహేష్ బాబు ట్వీట్ చేశారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: