దేశవ్యాప్తంగా అందరూ ఎదురుచూస్తున్న సినిమాల్లో రాధేశ్యామ్ కూడా ఒకటని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రభాస్ హీరోగా రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. కేవలం ప్రభాస్ అభిమానులు మాత్రమే కాదు సినీ లవర్స్ అందరూ ఈసినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఇక మార్చి 11న ఈసినిమా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో సినిమా రిలీజ్ కు మరికొన్ని రోజులు మాత్రమే ఉండటంతో సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటున్నారు చిత్రయూనిట్. సౌత్ నుండి నార్త్ వరకూ అన్ని ప్రాంతాల్లో జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇక ఈసినిమాపై ఇంత ఆసక్తి పెరగడానికి.. ఈసినిమాకు ఉన్న ప్రత్యేకతలు ఏంటో ఒకసారి చూద్దాం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్
ఈ సినిమాను ఈ రేంజ్ లో తెరకెక్కించడానికి ప్రధాన కారణం ప్రభాస్. ఏదో నార్మల్ లవ్ స్టోరీ తీద్దామని ఫిక్స్ అయిన రాధాకృష్ణ కు ప్రభాస్ వల్ల పాన్ ఇండియా రేంజ్ లో తీసే అవకాశం దక్కింది. ప్రభాస్ వల్లే ఈసినిమా స్థాయి పెరిగిందని రాధాకృష్ణ ఇప్పటికే చెప్పిన సంగతి గుర్తుండే ఉంటుంది కదా. సౌత్ లో మాత్రమే కాదు ప్రభాస్ కు బాహుబలి, సాహో వల్ల నార్త్ లో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఏర్పడమే కాదు.. మంచి మార్కెట్ కూడా ఏర్పడింది. అందుకే ప్రస్తుతం ప్రభాస్ వద్దకు పాన్ ఇండియా రేంజ్ సినిమాలు మాత్రమే వెళుతున్నాయి. నిర్మాతలు కూడా ప్రభాస్ కు ఎంత ఖర్చైనా పెట్టడానికి సిద్దంగా ఉన్నారు. అంతేకాదు చాలా కాలం తరువాత మరోసారి ఈసినిమాలో లవర్ బాయ్ పాత్రలో కనిపిస్తున్నాడు ప్రభాస్.
కథ
నిజానికి ప్రేమకథలు ప్రేక్షకులకు కొత్తేమీ కాదు. ఎన్నో వేల ప్రేమకథలు.. ఎన్నో లాంగ్వేజస్ లో తెరకెక్కాయి.. ప్రేక్షకులు కూాడా చూసుంటారు. కానీ ఎన్ని కథలు వచ్చినా ప్రేమకథలకు ఎక్ఫైరీ అనేది ఉండదు. రాధేశ్యామ్ కూడా అలాంటి ఓ అందమైన ప్రేమకావ్యమే. సినిమా మొదలు పెట్టినప్పుడే ఈ సినిమా ప్రేమకథ అని చెప్పారు మేకర్స్. ప్రేమకు విధికి మధ్య జరిగే పోరాటమే ఈసినిమా నేపథ్యం. చేతి రేఖలు చూసి భవిష్యత్తును చెప్పే వ్యక్తి.. తన ప్రేమ విషయంలో వచ్చే ఇబ్బందులను తెలుసుకొని ఎలా పోరాటం చేశాడు.. తన ప్రేమను ఎలా పొందాడు అన్నదే ఈసినిమాలో కీలకం..
విజువల్ వండర్
ఈసినిమాలో విజువల్స్ మాత్రం ప్రేక్షకులను కట్టిపడేస్తాయని ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, రెండు ట్రైలర్లను బట్టి అర్థమవతుంది. ఇటలీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈసినిమాలో విజువల్స్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. కరోనా కారణంగా యూరప్లో షూటింగ్ ఆగిపోవడంతో ఇండియాలో యూరప్ సెట్ వేసి మరీ చిత్రీకరించారు. ఖచ్చితంగా ఈసినిమా ప్రేక్షకులను మరో అందమైన ప్రపంచంలోకి తీసుకెళుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రిచ్ లోకేషన్స్ తో విజువల్ వండర్ ని చూపించబోతున్నారు మేకర్స్.
ప్రత్యేకతలు..
ఈసినిమాలో చాలానే ప్రత్యేకతలు ఉన్నాయి. కాస్టింగ్ దగ్గర నుండి రిలీజ్ వరకూ అన్నీ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్సే. ఎంతో మంది లెజెండరీ నటీనటులు ఈసినిమాలో నటిస్తున్నారు. ఇక పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కినా కేవలం ఇండియాలో మాత్రమే కాదు ఓవర్సీస్లో కూడా అత్యంత భారీగా రిలీజ్ చేస్తున్నారు. అమెరికాలోనే 1116కి పైగా లొకేషన్లలో, 3116కి పైగా స్క్రీన్ లలో , 11116కి పైగా షోలు వేస్తున్నారు. ఈ రేంజ్ లో రిలీజ్ అవుతున్న తెలుగు సినిమా ఇదే మొదటిది. అంతేనా ఈ సినిమా కోసం చాలా మంది సంగీత దర్శకులు పని చేస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్, అర్జిత్ సింగ్, మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్, జబిన్ నౌతీయల్, మనోజ్ ముంటాషిర్, కుమార్, రష్మీ విరాగ్ బృందం అంతా కలిసి సౌత్, నార్త్ వర్షన్స్కు రాధే శ్యామ్ సినిమాకు అద్భుతమైన క్లాసిక్ సంగీతం అందిస్తున్నారు. సౌత్ వర్షన్స్ కు థమన్ నేపథ్య సంగీతం అందిస్తున్నాడు. మెటావర్స్ లో ట్రైలర్ రిలీజ్ అయిన సినిమా కూడా ఇదే కావడం విశేషం..
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: