చేతన్ కుమార్ దర్శకత్వంలో దివంగత కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ నటించిన సినిమా జేమ్స్. ఈసినిమా నిర్మాణంలో చివరి దశలో ఉండగానే పునీత్ రాజ్ కుమార్ మరణించిన సంగతి తెలిసిందే కదా. అయినా కూడా మిగిలిన డబ్బింగ్ ను తన అన్నయ్య శివ రాజ్ కుమార్ తో చెప్పించి ఈసినిమాను రిలీజ్ చేస్తున్నారు. పునీత్ రాజ్ కుమార్ చివరి సినిమా అవ్వడంతో ఈసినిమా కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈసినిమాను పునీత్ రాజ్ కుమార్ పుట్టినరోజు అంటే మార్చి 17వ తేదీన రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు చిత్రబృందం. దీనిలో భాగంగా తాజాగా టీజర్ రిలీజ్ చేయగా అది సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా గురించి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఎమోషనల్ అయ్యాడు. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ను ఆభిమానించే వారికి జేమ్స్ సినిమా ఎప్పుడూ స్పెషల్ గానే ఉంటుంది.. మిస్ యూ అంటూ తన పోస్ట్ లో పేర్కొన్నాడు.
View this post on Instagram
కాగా ఈసినిమాలో ప్రియా ఆనంద్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమాలో శివ రాజ్కుమార్, రాఘవేంద్ర రాజ్కుమార్ కూడా కనిపించనున్నట్టు తెలుస్తుంది. కిషోర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈసినిమాకు చరణ్ రాజ్ సంగీతం అందించారు. కన్నడతో పాటు ఈ మూవీ ని తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషలలో కూడా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: