టాలీవుడ్ లో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో పూజాహెగ్డే తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే తెలుగు , తమిళ , హిందీ భాషల చిత్రాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పూజాహెగ్డే కథానాయికగా నటించిన “ఆచార్య “, “రాధేశ్యామ్”, “బీస్ట్ ”( తమిళ} మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. పూజాహెగ్డే ప్రస్తుతం “సర్కస్ “, “భాయిజాన్ “(హిందీ )మూవీస్ లో నటిస్తున్నారు. “#SSMB28”, “భవదీయుడు భగత్ సింగ్ ” మూవీస్ లో పూజాహెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యారు.“యానిమల్”హిందీ మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ కై దర్శకుడు సందీప్ స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే ను సంప్రదిస్తున్నట్టు సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
View this post on Instagram
సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ పూజాహెగ్డే తన లేటెస్ట్ ఫొటోస్ ను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. పలు మార్లు మాల్దీవ్స్ లో ఎంజాయ్ చేసిన పూజాహెగ్డే తాజాగా తన ఫ్యామిలీను తీసుకొని మరోసారి మాల్దీవ్స్ ట్రిప్ కి వెళ్ళారు .దాదాపు 13 సంవత్సరాల తరువాత ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కు వెళ్ళిన పూజాహెగ్డే ఒక ఫొటోను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు . ఆ ఫొటో లో పూజాహెగ్డే తల్లిదండ్రులతో పాటు సోదరుడు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: