ఇండస్ట్రీలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. పలువురు సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు. ఇక తాజాగా ప్రముఖ సీనియర్ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కు కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది. ప్రస్తుతం హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే కేవలం శివ శంకర్ మాస్టర్ కు మాత్రమే కాదు.. ఆయన పెద్ద కొడుకు కూడా కరోనా బారిన పడ్డారు. వీరిద్దరి పరిస్థితి కూడా కాస్త ఆందోళన కరంగానే ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆయన భార్య కూడా ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఒకేసారి కుటుంబసభ్యులంతా అనారోగ్యానికి గురవ్వడంతో శివ శంకర్ మాస్టర్ చిన్న కొడుకు అజయ్ కృష్ణపై ఆర్థిక భారం పడింది. వైద్య ఖర్చులు ఎక్కువవుతుండటంతో ఇప్పటికే సోషల్ మీడియో ద్వారా ఆర్థిసాయం చేయాలని కోరారు. దీనిలో భాగంగానే. శివశంకర్ మాస్టర్ కుటుంబానికి సాయం చేస్తానని ఇప్పటికే సినీనటుడు సోనూసూద్ ప్రకటించారు. ఇంకా పలువురు సెలబ్రిటీలు సాయం చేయడానికి ముందుకొచ్చారు. తాజాగా మా అధ్యక్షుడు మంచు విష్ణు కూడా దీనిపై స్పందించారు. ఏఐజీ హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడామని.. బెస్ట్ ట్రీట్ మెంట్ ఇస్తామని వారు చెప్పారని.. మాస్టర్ త్వరగా కోలుకోవాలని ప్రార్ధనలు చేద్దాం అంటూ ట్వీట్ చేశాడు.
Spoke with #AIG hospital and they assured the best care to SivaShankar Master. They are extending the best possible help and His son Mr. Ajay is also briefed. All we need now is our prayers for Master.
— Vishnu Manchu (@iVishnuManchu) November 26, 2021
ఇక ఇటీవల మోసగాళ్లు సినిమాతో అలరించిన మంచు విష్ణు ప్రస్తుతం ఢీ సీక్వెల్ కు రెడీ అవుతున్నాడు. శ్రీను వైట్ల దర్శకత్వంలో రాబోతున్న ఈసినిమాను ఇప్పటికే ప్రకటించగా త్వరలోనే ఈసినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.