సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో పుష్ప సినిమా వస్తున్న తెలిసిందే కదా. పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. గత కొద్దికాలంగా కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ పడగా.. ఇక రీసెంట్ గానే పుష్ప షూటింగ్ మళ్లీ రీస్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మారేడుమిల్లిలో శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇంతకుముందే కొంత వరకూ మారేడు మిల్లిలో షూటింగ్ ను జరుపుకోగా.. ఇప్పుడు మళ్లీ చిత్రయూనిట్ మరోసారి మారేడుమిల్లి అడవుల్లోనే షూట్ ను ప్రారంభించారు. దాదాపు నెల రోజుల పాటు ఈ షూటింగ్ జరగనున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తుండగా.. ఒక పాటను కూడా అక్కడే తీయనున్నారట. అక్కడ మారేడుమిల్లిలో షూటింగ్ పూర్తి అయిన వెంటనే హైదరాబాద్ లో మరికొంత ప్యాచ్ వర్క్ షూటింగ్ జరుపుకుంటుంది. దీంతో పుష్ప సినిమా చిత్రీకరణ పూర్తవుతుందట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా.. ఫహద్ ఫాజిల్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. రీసెంట్ గానే ఫహద్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. సునీల్, అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈసినిమా రెండు పార్ట్ లుగా వస్తున్న నేపథ్యంలో మొదటి భాగాన్ని ఈ ఏడాది క్రిస్మస్కు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: