“పెళ్ళిచూపులు “మూవీ ఘనవిజయం సాధించడంతో విజయ్ దేవరకొండ హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యారు. సెన్సేషనల్ హిట్ “అర్జున్ రెడ్డి “మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి విజయ్ దేవరకొండ బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకుని క్రేజీ హీరోగా మారారు. సూపర్ హిట్ “గీత గోవిందం “, “టాక్సీవాలా “మూవీస్ తో విజయ్ ప్రేక్షకులను అలరించారు. విజయ్ ప్రస్తుతం తెలుగు , హిందీ భాషలలో రూపొందుతున్న “లైగర్ “మూవీ లో కథానాయకుడిగా నటిస్తున్న విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “లైగర్ “మూవీ సెప్టెంబర్ 9వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో బాక్సర్ గా నటిస్తున్న విజయ్ థాయ్ ల్యాండ్ లో మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందారు. హీరో విజయ్ కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే నటిస్తున్నారు. ఒక షూటింగ్ షెడ్యూల్ ముంబై లో జరుపుకున్న “లైగర్ “మూవీ కరోనా కారణం గా చాలా గ్యాప్ తరువాత ముంబై లో సెకండ్ షెడ్యూల్ ప్రారంభమయ్యింది. కరోనా సెకండ్ వేవ్ తో షూటింగ్ నిలిచిపోయింది. “లైగర్ “మూవీ షూటింగ్ త్వరలోనే పునః ప్రారంభం కానుంది. ప్రస్తుత పాన్ ఇండియా యుగంలో ఇతరులతో పోటీపడుతూ విజయ్ ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నారు.” లైగర్” చిత్రంతో హిందీ మార్కెట్ ని స్వంతం చేసుకోవాలనే ఆలోచనతో ఉన్నారు. లేటెస్ట్ గా బైక్ ముందు నేలపై కూర్చుని తీక్షణంగా చూస్తున్న విజయ్ ఫోటో అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: