కరోనా సెకండ్ వేవ్ కారణంగా సినీ పరిశ్రమ మరోసారి భారీగానే నష్టపోయింది. థియేటర్లు అన్నీ కూడా మూత పడ్డాయి… షూటింగ్లు ఆగిపోయాయి. అయితే ఇప్పుడిప్పుడు మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. టాలీవుడ్లో కూడా షూటింగ్లు మొదలువుతున్నాయి. మెల్లిమెల్లిగా స్టార్ హీరోల నుండి యంగ్ హీరోల వరకూ సెట్స్ మీదకు వచ్చేందుకు ప్లాన్స్ వేస్తున్నారు. ఈ క్రమంలో మేజర్ సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
శశి కిరణ్ తిక్కా దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా వస్తున్న సినిమా మేజర్. 26/11 ముంబై తీవ్రవాద దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితాధారంగా ఈ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇకఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తయింది. చివరి దశలో ఉండగా కరోనా సెకండ్ వేవ్ వల్ల షూటింగ్ బ్రేక్ పడింది. ఇక మిగిలిన షూటింగ్ను జూలై నుండి స్టార్ట్ చేయనున్నట్టు అడివి శేష్ తన ఇన్స్టా ద్వారా తెలిపాడు.
View this post on Instagram
ఈ సినిమాలో శోభితా ధూళిపాళ్లతో పాటు సయీ మంజ్రేకర్ కూడా మరో కథానాయికగా నటిస్తుంది.మహేష్ హోమ్ బేనర్ జీఎంబీ ప్రొడక్షన్స్ సోనీ పిక్చర్స్తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలో కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: