మోడల్ , థియేటర్ ఆర్టిస్ట్ నభా నటేష్ “నన్ను దోచుకుందువటే “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యి , ఆ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్ “మూవీ లో తన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించి నభా నటేష్ టాలెంటెడ్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందారు. నభా నటేష్ ప్రస్తుతం శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ హీరోగా రూపొందుతున్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ “అంధాధున్ ” మూవీ తెలుగు రీమేక్ “మాస్ట్రో ” మూవీలో కథానాయికగా నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సోషల్ మీడియా లో నభా నటేష్ తన లేటెస్ట్ షూట్ ఫొటోస్ ను , తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత జీవితంలో విశేషాలను షేర్ చేస్తూ అభిమానుల్ని అలరిస్తున్నారు. తాజాగా తెలంగాణలో పదిరోజుల పాటు లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. కరోనా వ్యాప్తి నివారణకై ప్రతీ ఒక్కరూకరోనా నియమాల్ని పాటిస్తూ ఇంటిపట్టునే ఉండాలని నభానటేష్ కోరారు. లాక్డౌన్ సమయంలో ఇంట్లో సురక్షితంగా ఉంటూ ఆశావాహ దృక్పథాన్ని పెంచుకోండనీ , ఈ కష్ట సమయం లో కుటుంబానికి, స్నేహితులకు మనమున్నామనే భరోసానివ్వాలనీ , ప్రస్తుత పరిస్థితులలో ప్రతి ఒక్కరూ మానసికంగా కృంగిపోయి ఉన్నారు కాబట్టి మీ ఆప్తులు, సన్నిహితుల్ని విధిగా ఫోన్లో పలకరించండనీ , వారితో టచ్లో ఉండండనీ , . అదొక్క టే మన శ్రేయోభిలాషులందరికి కొండంత ధైర్యాన్నిస్తుందనీ నభానటేష్ ప్రజలకు సలహా ఇస్తూ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టారు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: