కరోనా సెకండ్ వేవ్ విజృంభణ తో చిత్ర పరిశ్రమకు చెందిన పలువురుప్రముఖులు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. రామ్ చరణ్ , పవన్ కళ్యాణ్ , అల్లు అర్జున్ , ఎన్టీఆర్ వంటి హీరోలకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. రామ్ చరణ్ , పవన్ కళ్యాణ్ కరోనా నుండి కోలుకోగా తాజాగా అల్లు అర్జున్ కోలుకున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజా కరోనా పరీక్షలలో నెగటివ్ గా నిర్ధారణ అయినట్టు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ట్విట్టర్ వేదికగా తనకు కరోనా నెగటివ్ గా తేలిందనీ, చాలా ఆరోగ్యం గా ఉన్నాననీ , మీ ప్రేమకు కృతజ్ఞతలు అంటూట్వీట్ చేశారు. తమ అభిమాన హీరో అల్లు అర్జున్ కు కరోనా నెగటివ్ అన్న వార్త తెలుసుకుని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకుని “పుష్ప “మూవీ పై అంచనాలు పెంచాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: